PM Modi: శరద్ పవార్ ప్రధాని కాలేకపోవడంపై .. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
PM Modi: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ దేశ ప్రధాని కాలేకపోవడానికి కారణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాల మూలంగానే శరద్ పవార్ ప్రధాని కాలేక పోయారని అన్నారు. ప్రధానమంత్రి కావడానికి యోగ్యత ఉన్నా.. అనుభవం, అర్హత ఉన్నప్పటికీ కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల మూలంగా ఆయన దేశ ప్రధాని కాలేకపోయారని అన్నారు. శరద్ పవారే కాదు.. రాష్ట్రపతిగా చేసిన ప్రణబ్ ముఖర్జీ కూడా ప్రధాని కాలేకపోవడానికి కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే కారణమని అన్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల కారణంగానే పవార్కు ప్రధాని అవకాశం చేజారిపోయిందని అన్నారు. శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ ఎన్సీపీని వీడి మహారాష్ట్ర కేబినెట్లో చేరిన తరువాత కొద్ది రోజుల అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీయే కూటమిలోని మహారాష్ట్ర ఎంపీలతో మంగళవారం ప్రధాని మోడీ సమావేశమయ్యారు.
Read also: Rose Flower: అమ్మబాబోయ్.. ఈ గులాబీల ధరతో మూడు సినిమాలను తియ్యొచ్చు తెలుసా?
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్న నాయకులు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని మోడీ మండిపడ్డారు. పేరున్న గొప్ప నేతల ఆకాంక్షలను కాంగ్రెస్ చంపేసిందని విమర్శించారు. ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటివారికి ప్రధాన మంత్రి పదవిని నిర్వహించే శక్తి, సామర్థ్యాలు ఉన్నప్పటికీ, వారు ఆ పదవిని చేపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాల కారణంగానే కాంగ్రెస్ అధిష్టానం ప్రతిభ కలిగిన అనేక మందిని ప్రోత్సహించలేదని మోడీ విమర్శించారు. ఉద్ధవ్ నేృతృత్వంలోని శివసేనపై విరుచుకుపడ్డారు. వారు ఏ కారణం లేకుండా వివాదాలు సృష్టించారని, అయినా సహించామని తెలిపారు. వారు ఓ వైపు అధికారంలో ఉంటూనే.. మరోవైపు విమర్శించాలనుకున్నారని.. ఒకేసారి ఈ రెండూ కలిసి ఎలా సాగుతాయని ప్రశ్నించారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుని, ఆ స్ఫూర్తితో దేశాన్ని అవినీతి, బుజ్జగింపులు, వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. తాను పదవిలో ఉన్నప్పటికీ, తప్పు చేసినవారికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో అధికారంలో ఉండి తప్పు చేసిన వారిని బాధ్యతలను, పదవులను తొలగించామని, ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లను నిరాకరించామని చెప్పారు. ఎన్డీయే కూటమిలో తమకు మిత్రపక్షాలే ముఖ్యమని.. అందరూ కలిసి మెలిసి జీవిస్తారని, గౌరవం లభిస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి గెలుస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!