PM Modi: శరద్ పవార్ ప్రధాని కాలేకపోవడంపై .. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ దేశ ప్రధాని కాలేకపోవడానికి కారణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాల మూలంగానే శరద్ పవార్ ప్రధాని కాలేక పోయారని అన్నారు. ప్రధానమంత్రి కావడానికి యోగ్యత ఉన్నా.. అనుభవం, అర్హత ఉన్నప్పటికీ కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల మూలంగా ఆయన దేశ ప్రధాని కాలేకపోయారని అన్నారు. శరద్ పవారే కాదు.. రాష్ట్రపతిగా చేసిన ప్రణబ్ ముఖర్జీ కూడా ప్రధాని కాలేకపోవడానికి కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే కారణమని అన్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల కారణంగానే పవార్కు ప్రధాని అవకాశం చేజారిపోయిందని అన్నారు. శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ ఎన్సీపీని వీడి మహారాష్ట్ర కేబినెట్లో చేరిన తరువాత కొద్ది రోజుల అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీయే కూటమిలోని మహారాష్ట్ర ఎంపీలతో మంగళవారం ప్రధాని మోడీ సమావేశమయ్యారు.
Read also: Rose Flower: అమ్మబాబోయ్.. ఈ గులాబీల ధరతో మూడు సినిమాలను తియ్యొచ్చు తెలుసా?
Also Read
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్న నాయకులు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని మోడీ మండిపడ్డారు. పేరున్న గొప్ప నేతల ఆకాంక్షలను కాంగ్రెస్ చంపేసిందని విమర్శించారు. ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటివారికి ప్రధాన మంత్రి పదవిని నిర్వహించే శక్తి, సామర్థ్యాలు ఉన్నప్పటికీ, వారు ఆ పదవిని చేపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాల కారణంగానే కాంగ్రెస్ అధిష్టానం ప్రతిభ కలిగిన అనేక మందిని ప్రోత్సహించలేదని మోడీ విమర్శించారు. ఉద్ధవ్ నేృతృత్వంలోని శివసేనపై విరుచుకుపడ్డారు. వారు ఏ కారణం లేకుండా వివాదాలు సృష్టించారని, అయినా సహించామని తెలిపారు. వారు ఓ వైపు అధికారంలో ఉంటూనే.. మరోవైపు విమర్శించాలనుకున్నారని.. ఒకేసారి ఈ రెండూ కలిసి ఎలా సాగుతాయని ప్రశ్నించారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుని, ఆ స్ఫూర్తితో దేశాన్ని అవినీతి, బుజ్జగింపులు, వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. తాను పదవిలో ఉన్నప్పటికీ, తప్పు చేసినవారికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో అధికారంలో ఉండి తప్పు చేసిన వారిని బాధ్యతలను, పదవులను తొలగించామని, ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లను నిరాకరించామని చెప్పారు. ఎన్డీయే కూటమిలో తమకు మిత్రపక్షాలే ముఖ్యమని.. అందరూ కలిసి మెలిసి జీవిస్తారని, గౌరవం లభిస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి గెలుస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!