PM Modi: శరద్ పవార్ ప్రధాని కాలేకపోవడంపై .. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ దేశ ప్రధాని కాలేకపోవడానికి కారణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాల మూలంగానే శరద్ పవార్ ప్రధాని కాలేక పోయారని అన్నారు. ప్రధానమంత్రి కావడానికి యోగ్యత ఉన్నా.. అనుభవం, అర్హత ఉన్నప్పటికీ కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల మూలంగా ఆయన దేశ ప్రధాని కాలేకపోయారని అన్నారు. శరద్ పవారే కాదు.. రాష్ట్రపతిగా చేసిన ప్రణబ్ ముఖర్జీ కూడా ప్రధాని కాలేకపోవడానికి కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే కారణమని అన్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల కారణంగానే పవార్కు ప్రధాని అవకాశం చేజారిపోయిందని అన్నారు. శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ ఎన్సీపీని వీడి మహారాష్ట్ర కేబినెట్లో చేరిన తరువాత కొద్ది రోజుల అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీయే కూటమిలోని మహారాష్ట్ర ఎంపీలతో మంగళవారం ప్రధాని మోడీ సమావేశమయ్యారు.
Read also: Rose Flower: అమ్మబాబోయ్.. ఈ గులాబీల ధరతో మూడు సినిమాలను తియ్యొచ్చు తెలుసా?
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్న నాయకులు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని మోడీ మండిపడ్డారు. పేరున్న గొప్ప నేతల ఆకాంక్షలను కాంగ్రెస్ చంపేసిందని విమర్శించారు. ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటివారికి ప్రధాన మంత్రి పదవిని నిర్వహించే శక్తి, సామర్థ్యాలు ఉన్నప్పటికీ, వారు ఆ పదవిని చేపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాల కారణంగానే కాంగ్రెస్ అధిష్టానం ప్రతిభ కలిగిన అనేక మందిని ప్రోత్సహించలేదని మోడీ విమర్శించారు. ఉద్ధవ్ నేృతృత్వంలోని శివసేనపై విరుచుకుపడ్డారు. వారు ఏ కారణం లేకుండా వివాదాలు సృష్టించారని, అయినా సహించామని తెలిపారు. వారు ఓ వైపు అధికారంలో ఉంటూనే.. మరోవైపు విమర్శించాలనుకున్నారని.. ఒకేసారి ఈ రెండూ కలిసి ఎలా సాగుతాయని ప్రశ్నించారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుని, ఆ స్ఫూర్తితో దేశాన్ని అవినీతి, బుజ్జగింపులు, వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. తాను పదవిలో ఉన్నప్పటికీ, తప్పు చేసినవారికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో అధికారంలో ఉండి తప్పు చేసిన వారిని బాధ్యతలను, పదవులను తొలగించామని, ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లను నిరాకరించామని చెప్పారు. ఎన్డీయే కూటమిలో తమకు మిత్రపక్షాలే ముఖ్యమని.. అందరూ కలిసి మెలిసి జీవిస్తారని, గౌరవం లభిస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి గెలుస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..