మాములుగా గులాబీల ధరలు పది, ఇరవై లేదా యాభై, ఇంకా ఎక్కువ అంటే రెండు వందలు ఉంటాయి.. కానీ గులాబీల ధరలు కోట్లు ఉండటం ఎప్పుడైనా విన్నారా.. ఏంటి గులాబీల ధరలు అన్ని కోట్లా అనే సందేహం వస్తుంది కదా.. కానీ ఇది నిజం..ప్రపంచంలో ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయి. వాటిని సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంటుంది. అలాగే.. ధనవంతులు సైతం కొనడానికి ఆలోచించే కాస్ట్లీ వస్తువులు కూడా ఉంటాయి. రోల్స్ రాయిస్, బుగాటీ, మెర్సిడెస్, లంబోర్గినీ వంటి కార్ల కంపెనీల గురించి వినే ఉంటారు.
ఆ కార్ల ధర బిలియన్లలో ఉంటుంది. వీటిని కొనడానికి బిలియనీర్లు సైతం 10 సార్లు ఆలోచిస్తారు. అయితే, అవి కార్లు కాబట్టి అంత మొత్తం ఉంటుందని భావించొచ్చు.. కోట్లు పలుకుతున్న ఈ గులాబీలు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పూలుగా నిలిచాయి.. ఈ గులాబీని పువ్వును జూలియట్ రోజు అని పిలుస్తారు. దీని ధర తెలిస్తే మీరు కోటీశ్వరులైనా.. కొనడానికి పలుమార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. ఆ పువ్వు కొనడానికి భారీగా వెచ్చించాల్సి ఉంటుంది.. ఒక్క జూలియట్ రోజ్ ధర రూ.130 కోట్లు. అయితే, దీనికి ఇంత ధరనా? అని మీరు అనుకోవచ్చు. కానీ, ఇందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ కారణంగానే ఆ పువ్వుకు భారీ ధర ఉంది. మరి ఆ పువ్వు ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాములుగా రోజా పువ్వులు విరివిగా పూస్తాయి. కానీ, ఈ జూలియట్ రోజ్ మాత్రం చాలా స్పెషల్. ఇది పెరగడానికి సుమారు 15 సంవత్సరాలు పడుతుంది.. ఈ పువ్వు పూసే లోపు మొక్క కూడా ఎండిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువే.. ఈ గులాబీని మొదటిసారిగా డేవిడ్ ఆస్టిన్ అనే వ్యక్తి ఒక ప్రయోగంగా పెంచాడు. ఇతను దానిని 2006 సంవత్సరంలో పెంచాడు. ఈ ప్రత్యేకమైన గులాబీని పెంచడానికి, అతను అనేక జాతుల గులాబీలను మిళితం చేసి, ప్రయోగాలు చేశాడు. ఈ ప్రయత్నంలో అతను విజయం సాధించాడు. దీన్ని పెంచేందుకు దాదాపు 37 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అయితే, ఈ పువ్వుకు జూలియట్ రోజ్ అని పేరు పెట్టాడు. ఇలా పెరిగిన జూలియన్ రోజ్ ఫ్లవర్ను డేవిడ్ ఆస్టిన్ రూ.90 కోట్లకు క్రయించినప్పటికీ ఇప్పుడు అది రూ.130 కోట్లు పలుకుతుంది..