PM Modi: కుంభమేళాని ప్రశంసించిన ప్రధాని మోడీ.. ప్రతిపక్షాల విమర్శలు..
- మహా కుంభమేళాపై ప్రధాని మోడీ ప్రశంసలు..
- తొక్కిసలాట మృతులకు నివాళర్పించలేదన్న రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరిగిన ‘‘మహాకుంభమేళా’’ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్లో కొనియాడారు. లోక్సభలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. కుంభమేళా విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారతదేశ కొత్త తరం మహా కుంభమేళాతో కనెక్ట్ అయిందని, న్యూ జనరేషన్ సంప్రదాయాలు, విశ్వాసాన్ని గర్వంగా స్వీకరిస్తోందని, కుంభమేళ ప్రపంచం మొత్తానికి భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసిందని, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత, మేము దానిని ప్రయాగ్రాజ్లో చూశామని’’ ప్రధాని మోడీ అన్నారు. కుంభమేళ సక్సె్స్కి కృషి చేసిన యూపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన కుంభమేళాకి దేశవిదేశాల నుంచి 66 కోట్ల మంది భక్తులు వచ్చారు.
Read Also: SC Classification: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్ రియాక్షన్!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
అయితే, ప్రధాని ప్రశంసలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘‘కుంభమేలా మన సంప్రదాయాలను, చరిత్ర, సంస్కృతిని తెలియజేస్తున్నాయి. ఈ విషయంలో ప్రధాని మోడీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాము. అయితే, కుంభమేళలో మరణించిన వారికి ప్రధాని నివాళులు అర్పించలేదనేదే మా ఫిర్యాదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రయాగ్ రాజ్ తొక్కిసలాటలో మరణించిన వారికి ప్రధాని నివాళులు అర్పించాల్సిందని రాహుల్ గాంధీ అన్నారు.
కుంభమేళాలో యువత పని అవకాశాలను ఆశించారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, కానీ వారు అనుమతించలేదని, ఇది న్యూ ఇండియా అంటూ రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు కుంభమేళా గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మహా కుంభమేళా గురించి ఆశావాదంతో మాట్లాడారని, ప్రతిపక్షాలకు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అవకాశం ఇవ్వాలని, ప్రతిపక్షాలకు కేవలం రెండు నిమిషాలు మాత్రమే అవకాశం ఇచ్చారని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!