PM Modi: కుంభమేళాని ప్రశంసించిన ప్రధాని మోడీ.. ప్రతిపక్షాల విమర్శలు..
- మహా కుంభమేళాపై ప్రధాని మోడీ ప్రశంసలు..
- తొక్కిసలాట మృతులకు నివాళర్పించలేదన్న రాహుల్ గాంధీ..
PM Modi: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరిగిన ‘‘మహాకుంభమేళా’’ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్లో కొనియాడారు. లోక్సభలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. కుంభమేళా విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారతదేశ కొత్త తరం మహా కుంభమేళాతో కనెక్ట్ అయిందని, న్యూ జనరేషన్ సంప్రదాయాలు, విశ్వాసాన్ని గర్వంగా స్వీకరిస్తోందని, కుంభమేళ ప్రపంచం మొత్తానికి భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసిందని, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత, మేము దానిని ప్రయాగ్రాజ్లో చూశామని’’ ప్రధాని మోడీ అన్నారు. కుంభమేళ సక్సె్స్కి కృషి చేసిన యూపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన కుంభమేళాకి దేశవిదేశాల నుంచి 66 కోట్ల మంది భక్తులు వచ్చారు.
Read Also: SC Classification: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్ రియాక్షన్!
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
అయితే, ప్రధాని ప్రశంసలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘‘కుంభమేలా మన సంప్రదాయాలను, చరిత్ర, సంస్కృతిని తెలియజేస్తున్నాయి. ఈ విషయంలో ప్రధాని మోడీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాము. అయితే, కుంభమేళలో మరణించిన వారికి ప్రధాని నివాళులు అర్పించలేదనేదే మా ఫిర్యాదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రయాగ్ రాజ్ తొక్కిసలాటలో మరణించిన వారికి ప్రధాని నివాళులు అర్పించాల్సిందని రాహుల్ గాంధీ అన్నారు.
కుంభమేళాలో యువత పని అవకాశాలను ఆశించారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, కానీ వారు అనుమతించలేదని, ఇది న్యూ ఇండియా అంటూ రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు కుంభమేళా గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మహా కుంభమేళా గురించి ఆశావాదంతో మాట్లాడారని, ప్రతిపక్షాలకు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అవకాశం ఇవ్వాలని, ప్రతిపక్షాలకు కేవలం రెండు నిమిషాలు మాత్రమే అవకాశం ఇచ్చారని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!