PM Modi: రాహుల్గాంధీపై మోడీ విమర్శలు.. ఆ నేతలకు పేదలంటే గిట్టదని సెటైర్లు
- రాహుల్గాంధీపై మోడీ విమర్శలు
- పేదలంటే గిట్టదని సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. కొంతమంది నేతలు పేదలతో ఫొటో సెషన్ చేస్తారని.. అదే సభలో పేదల గురించి మాట్లాడితే మాత్రం విసుగ్గా చూస్తారంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్సభలో మాట్లాడారు. ప్రజల సొమ్మును ప్రజలకే ఉపయోగిస్తామని చెప్పారు. ప్రజల కష్టాలు తెలిసిన వారికే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నాలుగు కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించామని… 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించామన్నారు. అలాగే ఐదేళ్లలో 12 కోట్ల మందికి మంచినీటి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఎన్నికల్లో తప్పుడు హామీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని మండిపడ్డారు. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: NBK 111: గోపీచంద్ తోనే బాలకృష్ణ నెక్స్ట్.. అంతా సెట్!
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
గతంలో స్కామ్లు గురించి వినేవాళ్లమని.. కానీ ఇప్పుడు స్కామ్లు లేవు అని చెప్పారు. ప్రపంచ గేమింగ్ రాజధానిగా భారత్ మారుతోందని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు ఎన్నికల వేళ హామీలు ఇస్తున్నాయని.. తప్పుడు హామీలు ఇచ్చి యువతను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీల్ని తప్పకుండా నెరవేర్చుతుందని.. రాజ్యంగం అంటే బీజేపీకి ప్రాణమని.. రాజ్యాంగం విలువలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Jr NTR: నాకోసం ఎవరూ పాదయాత్ర చేయొద్దు.. నేనే మీ అందరినీ కలుస్తా!
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!