Prashant kishor: కాంగ్రెస్ పై పీకే సంచలన వ్యాఖ్యలు… అక్కడ కూడా గెలవదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్తాన్ ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శిబిర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. దీని వల్ల కాంగ్రెస్ అధిష్టానం వారి నాయకత్వానికి కొంత సమయం ఇవ్వడం తప్పా సాధించిందేం లేదని.. రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఓడిపోతుందని ట్వీట్ చేశారు.
ఇటీవల వరస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చేలా ప్రశాంత్ కిషోర్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. పార్టీ మళ్లీ గాడిలో పడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు పీకే. పార్టీ నిర్మాణంతో పాటు వ్యూహాల్లో కూడా కీలక మార్పులను సూచించారు. ఆదే సమయంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక బాధ్యతలను చేపడుతారని ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఆ తరువాత నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని పీకే తెలిపారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీనే అని గతంలో పలు మార్లు పీకే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లేకుండా ఎలాంటి ఫ్రంట్ కూడా సాధ్యం కాదని వెల్లడించారు.
Also Read
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- IISc Study: ఆవు ఎంజైమ్తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
అయితే పీకే సూచించిన సూచనలను ‘చింతన్ శిబిర్ ’లో అమలు చేస్తారని పార్టీ నిర్మాణంలో కీలక మార్పులతో పాటు అధ్యక్ష ఎన్నికలు కూడా ఉండవచ్చనే వార్తలు వినిపించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం కొన్ని కీలక నిర్ణయాలను మాత్రమే తీసుకుంది. ‘ ఒక కుటుంబం- ఒక టికెట్’, పార్టీలో కనీసం 5 ఏళ్లు పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని… రాజ్యసభ స్థానం ఒకరికి రెండు సార్లు మాత్రమే కేటాయిస్తామనే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. కానీ పార్టీలో సంస్థాగత నిర్మాణంపై పెద్దగా చింతన్ శిబిర్ లో చర్చించలేదు. ఈనేపథ్యంలో పీకే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.
I’ve been repeatedly asked to comment on the outcome of #UdaipurChintanShivir
In my view, it failed to achieve anything meaningful other than prolonging the status-quo and giving some time to the #Congress leadership, at least till the impending electoral rout in Gujarat and HP!
— Prashant Kishor (@PrashantKishor) May 20, 2022
తాజావార్తలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
-
OTR: తెలంగాణలో భారీ ఎత్తున డబుల్ శాలరీ స్కామ్
-
OTR: మెదక్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ బయటపడ్డ విబేధాలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
-
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్కు సింపుల్ సీక్రెట్ ఇదే..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!