Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- పాకిస్తాన్ చర్చలకు వచ్చినా దాడులు చేశాము..
- ఆపరేషన్ సిందూర్పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీడీఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చర్చలు జరపాలని భారత్ను సంప్రదించినా దాడులు చేసినట్లు మాజీ CDS జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉదయం సుమారు 10 గంటల సమయంలో చర్చల కోసం ఫోన్ చేసిందని, ఆ సమయంలో భారత వైమానిక దళం చీఫ్ సర్గోధాపై దాడి చేయాలా అని తనను అడిగార, అందుకు తాను ‘‘గో ఎహెడ్’’ అని అనుమతి ఇచ్చారని వెల్లడించారు. ఇదే కాకుండా మరో రెండు టార్గెట్లను గుర్తించాలని కోరినట్లు తెలిపారు. వాటిలో ఒకటి పీఓకేలోని స్కార్దుపై దాడికి కూడా అనుమతించినట్లు చెప్పారు. వాతావారణ బాగా లేకపోవడం వల్ల ఆ దాడిని భోలారికి మార్చాల్సి వచ్చిందన్నారు.
ఆపరేషన్ సిందూర్లో భారత్ రూపొందించుకున్న ఎస్కలేషన్ మ్యాట్రిక్స్లో కీలక సూత్రం ఉందని చౌహాన్ చెప్పారు. చివరి దాడి లేదా విజయాన్ని నిర్ణయించే దాడి ఎప్పుడూ మన నుంచే ఉండాలని, పాకిస్తాన్ నుంచి కాదని ఇదే తమ వ్యూహంలో ముఖ్య సూత్రమని చెప్పారు. ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగితే, వాటికి అనుగుణంగా తదుపరి దశలకు వెళ్లేలా భారత సైన్యం ముందుగానే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం తక్కువ ఎత్తులో ఉన్న గగనతలాన్ని వినియోగించడాన్ని ప్రత్యేక వ్యూహంగా ఎంచుకుందని చౌహాన్ చెప్పారు. ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత్ గ్రౌండ్ ఆపరేషన్ చేసిందని, పుల్వామా తర్వాత పెద్ద స్థాయి వైమానిక దాడులు జరిగాయని గుర్తు చేసిన ఆయన, ఆపరేషన్ సిందూర్ సమయంలో మూడో మార్గంగా తక్కువ ఎత్తులోని గగనతలాన్ని వినియోగించినట్లు వివరించారు. దీని వల్ల సంఘర్షణ స్థాయిని నియంత్రణలో ఉంచడంతో పాటు విజయావకాశాలను పెంచి ప్రత్యర్థికి షాక్ కలిగించవచ్చని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్లో భారత్ విజయానికి మెరుగైన సిట్యుయేషనల్ అవేర్నెస్, బ్యాటిల్ఫీల్డ్ ట్రాన్స్పరెన్సీ, మూడు దళాల మధ్య మెరుగైన నెట్వర్కింగ్ ప్రధాన కారణాలని చౌహాన్ తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు దళాలకు ఒకే విధమైన కామన్ ఆపరేషన్ పిక్చర్ అందుబాటులో ఉండటంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలిగామని చెప్పారు. రాజకీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం కూడా కీలకమైందని, దీంతో ఆపరేషన్ ప్రణాళిక చేసుకునేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ లభించిందని తెలిపారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!