Prashant Kishore: తెల్లవారుజామున ప్రశాంత్ కిషోర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిమ్స్కు తరలింపు..
- గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిషోర్..
- ఈరోజు తెల్లవారుజామున ప్రశాంత్ కిషోర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- పాట్నా నుంచి అంబులెన్స్లో ఎక్కించి ఎయిమ్స్కు తీసుకెళ్లారు పోలీసులు..
- గత 20 రోజులుగా ప్రిలిమినరీ పోటీ పరీక్షను రద్దు చేయాలనే అభ్యర్థుల డిమాండ్..
Prashant Kishore: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ (జేఎస్యూపీఏ) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను ఈరోజు (జనవరి 6) తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి పీకేను బలవంతంగా అంబులెన్స్లో ఎక్కించి ఎయిమ్స్కు తీసుకెళ్లారు పోలీసులు. కాగా, ఇక, దీక్ష శిబిరం నుంచి ప్రశాంత్ కిషోర్ను నిరాహార దీక్ష స్థలం నుంచి వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో బలవంతంగా తరలిస్తుండగా అతని మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు “వందేమాతరం” నినాదాలు చేస్తుండగానే ప్రశాంత్ కిషోర్ ను పాట్నా పోలీసులు తీసుకెళ్లారు.
Read Also: Megastar : ఇండస్ట్రీలో టాలెంట్తో పాటు, చక్కటి ప్రవర్తన కూడా ఉండాలి..
Also Read
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
అయితే, అంతకుముందు ప్రశాంత్ కిషోర్ సహా అతని 150 మంది మద్దతుదారులపై పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది చట్టవిరుద్ధమైన ఆందోళన అని చెప్పుకొచ్చారు. పాట్నా హైకోర్టు ఆదేశాల ప్రకారం.. గర్దానీ బాగ్లోని నిర్దేశిత స్థలంలో కాకుండా వేరే ప్రదేశంలో ధర్నాను అనుమతించకూడదని తేల్చి చెప్పింది. కానీ, ప్రశాంత్ కిషోర్ గాంధీ మైదాన్ లో నిరసనకు దిగడంతో అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, డిసెంబర్ 13న BPSC నిర్వహించిన ప్రిలిమినరీ పోటీ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా జన్ సూరాజ్ చీఫ్ పీకే జనవరి 2వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
#WATCH | BPSC protest | Bihar: Patna Police detained Jan Suraaj chief Prashant Kishor who was sitting on an indefinite hunger strike at Gandhi Maidan pic.twitter.com/JQ7Fm7wAoR
— ANI (@ANI) January 6, 2025
తాజావార్తలు
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో