Prashant Kishore: తెల్లవారుజామున ప్రశాంత్ కిషోర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిమ్స్కు తరలింపు..
- గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిషోర్..
- ఈరోజు తెల్లవారుజామున ప్రశాంత్ కిషోర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- పాట్నా నుంచి అంబులెన్స్లో ఎక్కించి ఎయిమ్స్కు తీసుకెళ్లారు పోలీసులు..
- గత 20 రోజులుగా ప్రిలిమినరీ పోటీ పరీక్షను రద్దు చేయాలనే అభ్యర్థుల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishore: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ (జేఎస్యూపీఏ) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను ఈరోజు (జనవరి 6) తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి పీకేను బలవంతంగా అంబులెన్స్లో ఎక్కించి ఎయిమ్స్కు తీసుకెళ్లారు పోలీసులు. కాగా, ఇక, దీక్ష శిబిరం నుంచి ప్రశాంత్ కిషోర్ను నిరాహార దీక్ష స్థలం నుంచి వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో బలవంతంగా తరలిస్తుండగా అతని మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు “వందేమాతరం” నినాదాలు చేస్తుండగానే ప్రశాంత్ కిషోర్ ను పాట్నా పోలీసులు తీసుకెళ్లారు.
Read Also: Megastar : ఇండస్ట్రీలో టాలెంట్తో పాటు, చక్కటి ప్రవర్తన కూడా ఉండాలి..
Also Read
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Pradeep Kumar IAS: పదవీ విరమణ రోజే సీబీఐ షాక్.. ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు.. కారణం ఇదే!
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
అయితే, అంతకుముందు ప్రశాంత్ కిషోర్ సహా అతని 150 మంది మద్దతుదారులపై పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది చట్టవిరుద్ధమైన ఆందోళన అని చెప్పుకొచ్చారు. పాట్నా హైకోర్టు ఆదేశాల ప్రకారం.. గర్దానీ బాగ్లోని నిర్దేశిత స్థలంలో కాకుండా వేరే ప్రదేశంలో ధర్నాను అనుమతించకూడదని తేల్చి చెప్పింది. కానీ, ప్రశాంత్ కిషోర్ గాంధీ మైదాన్ లో నిరసనకు దిగడంతో అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, డిసెంబర్ 13న BPSC నిర్వహించిన ప్రిలిమినరీ పోటీ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా జన్ సూరాజ్ చీఫ్ పీకే జనవరి 2వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
#WATCH | BPSC protest | Bihar: Patna Police detained Jan Suraaj chief Prashant Kishor who was sitting on an indefinite hunger strike at Gandhi Maidan pic.twitter.com/JQ7Fm7wAoR
— ANI (@ANI) January 6, 2025
తాజావార్తలు
-
Ayodhya: “వాష్రూమ్లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
-
Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు
-
Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Home Tips: వర్షాలు మొదలయ్యాక ఇంట్లో ఈగలు ఎక్కువయ్యాయా? ఇలా చేయండి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!