Prashant Kishore: తెల్లవారుజామున ప్రశాంత్ కిషోర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిమ్స్కు తరలింపు..
- గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిషోర్..
- ఈరోజు తెల్లవారుజామున ప్రశాంత్ కిషోర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- పాట్నా నుంచి అంబులెన్స్లో ఎక్కించి ఎయిమ్స్కు తీసుకెళ్లారు పోలీసులు..
- గత 20 రోజులుగా ప్రిలిమినరీ పోటీ పరీక్షను రద్దు చేయాలనే అభ్యర్థుల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishore: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ (జేఎస్యూపీఏ) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను ఈరోజు (జనవరి 6) తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి పీకేను బలవంతంగా అంబులెన్స్లో ఎక్కించి ఎయిమ్స్కు తీసుకెళ్లారు పోలీసులు. కాగా, ఇక, దీక్ష శిబిరం నుంచి ప్రశాంత్ కిషోర్ను నిరాహార దీక్ష స్థలం నుంచి వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో బలవంతంగా తరలిస్తుండగా అతని మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు “వందేమాతరం” నినాదాలు చేస్తుండగానే ప్రశాంత్ కిషోర్ ను పాట్నా పోలీసులు తీసుకెళ్లారు.
Read Also: Megastar : ఇండస్ట్రీలో టాలెంట్తో పాటు, చక్కటి ప్రవర్తన కూడా ఉండాలి..
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
అయితే, అంతకుముందు ప్రశాంత్ కిషోర్ సహా అతని 150 మంది మద్దతుదారులపై పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది చట్టవిరుద్ధమైన ఆందోళన అని చెప్పుకొచ్చారు. పాట్నా హైకోర్టు ఆదేశాల ప్రకారం.. గర్దానీ బాగ్లోని నిర్దేశిత స్థలంలో కాకుండా వేరే ప్రదేశంలో ధర్నాను అనుమతించకూడదని తేల్చి చెప్పింది. కానీ, ప్రశాంత్ కిషోర్ గాంధీ మైదాన్ లో నిరసనకు దిగడంతో అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, డిసెంబర్ 13న BPSC నిర్వహించిన ప్రిలిమినరీ పోటీ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా జన్ సూరాజ్ చీఫ్ పీకే జనవరి 2వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
#WATCH | BPSC protest | Bihar: Patna Police detained Jan Suraaj chief Prashant Kishor who was sitting on an indefinite hunger strike at Gandhi Maidan pic.twitter.com/JQ7Fm7wAoR
— ANI (@ANI) January 6, 2025
తాజావార్తలు
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి