Rahul Gandhi: రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో విద్యుత్ అంతరాయం.. బీజేపీ కారణమని విమర్శలు..
- అదానీ వ్యవహారంపై రాహుల్ గాంధీ మీడియా సమావేశం..
- సమావేశంలో విద్యుత్ అంతరాయం..
- అదానీ-మోడీ కారణమని రాహుల్ విమర్శ..
- రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: అదానీ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతో సహా అతడి మేనల్లుడు సాగర్ అదానీ మరికొందరు 2020-2024 మధ్యాలంలో రూ. 2,029 కోట్లు అంచాలు ఇచ్చారని అమెరికా న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది.
అయితే, దీనిపై కాంగ్రెస్, దాని అధినేత రాహుల్ గాంధీ అదానీపై మరోసారి ఆరోపణలు గుప్పించారు. మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి అదానీకి, పీఎం మోడీ రక్షిస్తున్నాడని అతను స్వేచ్ఛగా ఉన్నాడని ఆరోపించారు. అదానీని అరెస్ట్ చేసి విచారిస్తే తప్పా ఎలాంటి విచారణ నమ్మదగినది కాదని చెప్పారు. అంతిమంగా బీజేపీ నిధులు నిర్మాణం మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నందున నరేంద్రమోడీ పేరు బయటకు వస్తుందని చెప్పారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Vivo Y300 5G: మిడ్ రేంజ్లో సొగసైన డిజైన్తో ఫోన్ను తీసుకొచ్చిన వివో.. వివరాలు ఇలా
ఈ మీడియా సమావేశంలో ఆరోపణలు చేస్తున్న సమయంలో విద్యుత్ అంతరాయం కలిగింది. అయితే, ఈ కరెంట్ కోతకు ‘‘అదానీ పవర్, మోడీ పవర్’’ కారణమని రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ సంబిత్ పాత్ర రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ‘‘రాహుల్ గాంధీని ఆపేందుకు అతని సన్నిహితుడు జైరాం రమేష్ కరెంట్ కట్ చేసి ఉండొచ్చు’’ అని సెటైర్ వేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సంబిత్ పాత్ర మాట్లాడుతూ..“రాహుల్ గాంధీ అదే మూడు పదాలను పునరావృతం చేస్తూనే ఉన్నారు-అదానీ, అంబానీ, చోర్. ఈరోజు తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కరెంటు పోయిందని, దానికి కూడా అదానీని, మోడీని దూషించాడు. ఇది ఆయన కార్యాలయంలో రాహుల్ గాంధీ పక్కన కూర్చున్న జైరాం రమేష్ ‘రాహుల్ గాంధీ చాలు’ అనుకుని పవర్ కట్ చేసి ఉండొచ్చు’’ అని అన్నారు. రాఫెల్, కోవిడ్ వ్యాక్సిన్లు, ఇప్పుడు అదానీ వంటి సమస్యలను గాంధీ ఉపయోగించుకుని పార్లమెంటు సమావేశాలకు ముందు అంతరాయం కలిగించారని పాత్రా ఆరోపించారు. భారత సంస్థలపై దాడి చేయడానికి రాహుల్ గాంధీ సాధారణ వ్యూహం ఇది అని ఆరోపించారు.
తాజావార్తలు
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
-
CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!