Devendra Fadnavis: బంపర్ మెజారిటీలో మూడోసారి ప్రధాని మోడీ అధికారం చేపడుతారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రధానిగా గెలిపించాలని దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయవచ్చనే ఊహాగానాలను దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీకి బంపర్ మెజారిటీ ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ప్రజలు మనసు మార్చుకోరని అన్నారు.
Read Also: Israel: గాజా ఆస్పత్రి కంప్యూటర్లలో ఇజ్రాయిల్ బందీల సమాచారం..
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
వచ్చే ఏడాది జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను నాగ్పూర్ నుంచి పోటీ చేస్తానని, లోక్ సభ ఎన్నికల పోటీపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తాను బీజేపీలో ఉంటానని, పార్టీ తనకు ఇచ్చిన ఏ బాధ్యతనూనా నిర్వహిస్తానని చెప్పారు. మరాఠా కోటా, దాని కోసం పోరాడుతున్న మనోజ్ జరాంగే రాష్ట్రవ్యాప్త పర్యటన గురించి మాట్లాడుతూ.. శాంతిభద్రతలను కాపాడటమే తన ప్రాధాన్యత అని అన్నారు. మరాఠా కోటాకు హమీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఓబీసీ కోటాలో మరాఠా సమాజానికి వాటా ఇవ్వడాన్ని సీనియర్ మంత్రి ఛగన్ భుజ్ బల్ వ్యతిరేకించడం గమనార్హం. వచ్చే శీతాకాల సమావేశాల్లోపు మంత్రివర్గ విస్తరణకు ప్రయత్నిస్తామని చెప్పారు. రామ మందిర ప్రారంభోత్సవం ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని, అయోధ్యలో మహారాష్ట్ర భవన్ నిర్మాణానికి భూమి కేటాయించడానికి యూపీ ప్రభుత్వం అంగీకరించిందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం మహారాష్ట్ర సర్కార్లో బీజేపీ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇటీవల మూడు పార్టీలు కలిసి మహారాష్ట్ర గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి బంపర్ విక్టరీని నమోదు చేశాయి. మెజారిటీ స్థానాలను బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ఎంపీ స్థానాలు బీజేపీకి కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
-
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..