PM Modi: పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నిమిషాల్లో నాశనం చేశాం..
- ఇది న్యూ ఇండియా..
- పాక్ ఎయిర్బేసుల్ని నిమిషాల్లో నాశనం చేశాం..
- ఆపరేషన్ సిందూర్ ముగియలేదు..
- ఉగ్రవాదం తలెత్తిన ప్రతీసారి అణిచివేస్తాం: ప్రధాని నరేంద్రమోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాలను నాశనం చేశామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది న్యూ ఇండియా అని, భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని శుక్రవారం బీహార్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ అన్నారు. ఉగ్రవాద దాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో తాను హామీ ఇచ్చానని, ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని చెప్పారు.
Read Also: IPL 2025:’ఆర్సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా’.. పోస్టర్ వైరల్
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బీహార్ గడ్డపై నుంచి నుంచి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టం, భూమి అంచుల వరకు వేటాడుతాం’’ అని ప్రకటించారు. ‘‘పహల్గామ్ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నేను బీహార్కు వచ్చాను మరియు ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తామని బీహార్ నేల నుండి దేశానికి హామీ ఇచ్చాను. వారికి ఊహకు అందని శిక్ష విధించబడుతుందని నేను చెప్పాను. ఇప్పుడు నేను బీహార్కు తిరిగి వచ్చాను, నా వాగ్దానాన్ని నెరవేర్చాను. పాకిస్తాన్లో కూర్చుని మన సోదరీమణుల సిందూరాన్ని నాశనం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నాం. మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను శిథిలాలుగా మార్చింది. పాకిస్తాన్, ప్రపంచం సిందూర్ శక్తిని చూసింది’’ అని ప్రధాని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, ఉగ్రవాదం తిరిగి తలెత్తడానికి ప్రయత్నించినప్పుడల్లా దానిపై దాడి చేస్తూనే ఉంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్లో శత్రువులు భారత్ బలాన్ని చూశారు. మన అంబులపొదిలో ఒకే ఒక బాణం ఉందని అర్థం చేసుకోవాలి, ఉగ్రవాదం ముగిసే వరకు ఈ పోరాటం ముగియదు. ఉగ్రవాదం మళ్లీ తలెత్తితే, భారత్ దానిని అణిచివేస్తుంది’’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!