PM Modi: పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నిమిషాల్లో నాశనం చేశాం..
- ఇది న్యూ ఇండియా..
- పాక్ ఎయిర్బేసుల్ని నిమిషాల్లో నాశనం చేశాం..
- ఆపరేషన్ సిందూర్ ముగియలేదు..
- ఉగ్రవాదం తలెత్తిన ప్రతీసారి అణిచివేస్తాం: ప్రధాని నరేంద్రమోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాలను నాశనం చేశామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది న్యూ ఇండియా అని, భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని శుక్రవారం బీహార్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ అన్నారు. ఉగ్రవాద దాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో తాను హామీ ఇచ్చానని, ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని చెప్పారు.
Read Also: IPL 2025:’ఆర్సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా’.. పోస్టర్ వైరల్
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బీహార్ గడ్డపై నుంచి నుంచి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టం, భూమి అంచుల వరకు వేటాడుతాం’’ అని ప్రకటించారు. ‘‘పహల్గామ్ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నేను బీహార్కు వచ్చాను మరియు ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తామని బీహార్ నేల నుండి దేశానికి హామీ ఇచ్చాను. వారికి ఊహకు అందని శిక్ష విధించబడుతుందని నేను చెప్పాను. ఇప్పుడు నేను బీహార్కు తిరిగి వచ్చాను, నా వాగ్దానాన్ని నెరవేర్చాను. పాకిస్తాన్లో కూర్చుని మన సోదరీమణుల సిందూరాన్ని నాశనం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నాం. మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను శిథిలాలుగా మార్చింది. పాకిస్తాన్, ప్రపంచం సిందూర్ శక్తిని చూసింది’’ అని ప్రధాని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, ఉగ్రవాదం తిరిగి తలెత్తడానికి ప్రయత్నించినప్పుడల్లా దానిపై దాడి చేస్తూనే ఉంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్లో శత్రువులు భారత్ బలాన్ని చూశారు. మన అంబులపొదిలో ఒకే ఒక బాణం ఉందని అర్థం చేసుకోవాలి, ఉగ్రవాదం ముగిసే వరకు ఈ పోరాటం ముగియదు. ఉగ్రవాదం మళ్లీ తలెత్తితే, భారత్ దానిని అణిచివేస్తుంది’’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!