PM Modi: పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నిమిషాల్లో నాశనం చేశాం..
- ఇది న్యూ ఇండియా..
- పాక్ ఎయిర్బేసుల్ని నిమిషాల్లో నాశనం చేశాం..
- ఆపరేషన్ సిందూర్ ముగియలేదు..
- ఉగ్రవాదం తలెత్తిన ప్రతీసారి అణిచివేస్తాం: ప్రధాని నరేంద్రమోడీ..
PM Modi: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాలను నాశనం చేశామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది న్యూ ఇండియా అని, భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని శుక్రవారం బీహార్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ అన్నారు. ఉగ్రవాద దాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో తాను హామీ ఇచ్చానని, ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని చెప్పారు.
Read Also: IPL 2025:’ఆర్సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా’.. పోస్టర్ వైరల్
Also Read
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బీహార్ గడ్డపై నుంచి నుంచి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టం, భూమి అంచుల వరకు వేటాడుతాం’’ అని ప్రకటించారు. ‘‘పహల్గామ్ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నేను బీహార్కు వచ్చాను మరియు ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తామని బీహార్ నేల నుండి దేశానికి హామీ ఇచ్చాను. వారికి ఊహకు అందని శిక్ష విధించబడుతుందని నేను చెప్పాను. ఇప్పుడు నేను బీహార్కు తిరిగి వచ్చాను, నా వాగ్దానాన్ని నెరవేర్చాను. పాకిస్తాన్లో కూర్చుని మన సోదరీమణుల సిందూరాన్ని నాశనం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నాం. మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను శిథిలాలుగా మార్చింది. పాకిస్తాన్, ప్రపంచం సిందూర్ శక్తిని చూసింది’’ అని ప్రధాని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, ఉగ్రవాదం తిరిగి తలెత్తడానికి ప్రయత్నించినప్పుడల్లా దానిపై దాడి చేస్తూనే ఉంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్లో శత్రువులు భారత్ బలాన్ని చూశారు. మన అంబులపొదిలో ఒకే ఒక బాణం ఉందని అర్థం చేసుకోవాలి, ఉగ్రవాదం ముగిసే వరకు ఈ పోరాటం ముగియదు. ఉగ్రవాదం మళ్లీ తలెత్తితే, భారత్ దానిని అణిచివేస్తుంది’’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!