PM Modi: పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నిమిషాల్లో నాశనం చేశాం..
- ఇది న్యూ ఇండియా..
- పాక్ ఎయిర్బేసుల్ని నిమిషాల్లో నాశనం చేశాం..
- ఆపరేషన్ సిందూర్ ముగియలేదు..
- ఉగ్రవాదం తలెత్తిన ప్రతీసారి అణిచివేస్తాం: ప్రధాని నరేంద్రమోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాలను నాశనం చేశామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది న్యూ ఇండియా అని, భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని శుక్రవారం బీహార్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ అన్నారు. ఉగ్రవాద దాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో తాను హామీ ఇచ్చానని, ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని చెప్పారు.
Read Also: IPL 2025:’ఆర్సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా’.. పోస్టర్ వైరల్
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బీహార్ గడ్డపై నుంచి నుంచి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టం, భూమి అంచుల వరకు వేటాడుతాం’’ అని ప్రకటించారు. ‘‘పహల్గామ్ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నేను బీహార్కు వచ్చాను మరియు ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తామని బీహార్ నేల నుండి దేశానికి హామీ ఇచ్చాను. వారికి ఊహకు అందని శిక్ష విధించబడుతుందని నేను చెప్పాను. ఇప్పుడు నేను బీహార్కు తిరిగి వచ్చాను, నా వాగ్దానాన్ని నెరవేర్చాను. పాకిస్తాన్లో కూర్చుని మన సోదరీమణుల సిందూరాన్ని నాశనం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నాం. మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను శిథిలాలుగా మార్చింది. పాకిస్తాన్, ప్రపంచం సిందూర్ శక్తిని చూసింది’’ అని ప్రధాని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, ఉగ్రవాదం తిరిగి తలెత్తడానికి ప్రయత్నించినప్పుడల్లా దానిపై దాడి చేస్తూనే ఉంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్లో శత్రువులు భారత్ బలాన్ని చూశారు. మన అంబులపొదిలో ఒకే ఒక బాణం ఉందని అర్థం చేసుకోవాలి, ఉగ్రవాదం ముగిసే వరకు ఈ పోరాటం ముగియదు. ఉగ్రవాదం మళ్లీ తలెత్తితే, భారత్ దానిని అణిచివేస్తుంది’’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!