PM Modi: పాకిస్థాన్కు మోడీ మూడు వార్నింగ్లు
- పాకిస్థాన్కు మోడీ మూడు వార్నింగ్లు
- ఈసారి ధీటుగా సమాధానం చెబుతామన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ అణ్వస్త్ర బ్లాక్మెయిల్కు భారత్ భయపడదని.. అలాంటి బెదిరింపులను ఏ మాత్రం సహించబోమని ప్రధాని మోడీ దాయాది దేశాన్ని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి 22 నిమిషాల పాటు ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్కు మూడు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు భద్రతా సిద్ధాంతాన్ని మోడీ వివరించారు.
మొదటి హెచ్చరిక:
భారత్పై జరిగే ఏ ఉగ్రవాద దాడికైనా ఈసారి బలమైన మరియు దృఢమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. భారత్ సొంత సామర్థ్యం మేరకే ప్రతీకారం తీర్చుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాద కేంద్రాలను, వారి మూలాలపై భారత్ లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నారు.
Also Read
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
- Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
రెండో హెచ్చరిక:
భారతదేశం అణు బెదిరింపులకు భయపడదన్నారు. అలాంటి బెదిరింపులతో ఎలాంటి ఉగ్ర దాడులకు పాల్పడినా తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
మూడో హెచ్చరిక:
ఉగ్రవాదానికి, వారికి ఆశ్రయం కల్పిస్తున్న ప్రభుత్వాలను ప్రత్యేకంగా చూడబోమన్నారు. ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాదులు చనిపోతే.. వారి అంత్యక్రియలకు బహిరంగంగా పాకిస్థాన్ సైనిక అధికారులు హాజరు కావడం ప్రపంచమంతా చూసిందని తెలిపారు. అంటే ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఎంత సపోర్టుగా ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: పాక్తో చర్చలు జరిగితే ఇకపై ఉగ్రవాదం.. పీవోకేపైనే
21వ శతాబ్ధంలో మేక్ ఇన్ ఇండియా తయారు చేసిన ఆయుధాలనే పాకిస్థాన్పై ప్రయోగించినట్లు ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్తో చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై పాకిస్థాన్పై చర్చల అంశం వస్తే.. ఉగ్రవాదం, పాకిస్థాన్ ఆక్రమిత కార్మీర్(పీవోకే)పైనే జరుగుతాయని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి జరగవన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: భారత్ ‘‘న్యూక్లియర్’’ బ్లాక్మెయిల్ని సహించదు.. పాక్కి మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!