PM Modi: భారత్ ‘‘న్యూక్లియర్’’ బ్లాక్మెయిల్ని సహించదు.. పాక్కి మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..
- అణు బ్లాక్మెయిన్ని సహించేది లేదు..
- పాకిస్తాన్కి ప్రధాని మోడీ వార్నింగ్..
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టి పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. దీని తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ మహిళల సిందూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దాడులు చేశామని చెప్పారు. ప్రపంచ ఉగ్రవాదానికి యూనివర్సిటీలుగా ఉన్న బహవల్పూర్, మురిడ్కే ప్రాంతాలను నాశనం చేసినట్లు చెప్పారు.
Read Also: Congress: జమ్మూ కాశ్మీర్ని పాక్లో భాగంగా చూపించిన కాంగ్రెస్ పోస్ట్.. బీజేపీ విమర్శలు..
Also Read
అణ్వాయుధాలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడాన్ని భారత్ ఇక సహించదని పాకిస్తాన్కి ప్రధాని వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఏ విధమైన అణు బ్లాక్మెయిల్ భారత్ సహించదు. ఈ బ్లాక్మెయిల్ కింద పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల్ని లక్ష్యంగా చేసుకుంటాం’’ అని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్రవాదంపై భారత్ బలమైన వైఖరితో ఉన్నామని, ఏదైనా ఉగ్రదాడి జరిగితే భారతదేం తగిన సమాధానం ఇస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ప్రభుత్వాలను, ఉగ్రవాదుల్ని మేము వేరువేరుగా చూడమని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!