PM Modi: సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్..
- భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు..
- సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్..
- సరిహద్దు ప్రాంతాల్లో భద్రతాపై ప్రధాని మోడీ ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దాయాది దేశం.. ఇప్పుడు మనపై రెచ్చగొట్టే చర్యలకు దిగుతుంది. డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ట్రై చేస్తుంది. వీటిని భారత బలగాలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తాజాగా, సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. ముఖ్యంగా పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న గుజరాత్ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడారు.
Read Also: Samsung Galaxy F56 5G: భారత్ లో అధికారికంగా విడుదలైన గెలాక్సీ F56..!
Also Read
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో భద్రతా సన్నద్ధతపై ప్రధాని మోడీ ఆరా తీసి అక్కడ ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అయితే, భద్రతాపరంగా సున్నిత ప్రాంతాలైన కచ్, బనస్కంతా, పటాన్, జామ్ నగర్లో పౌరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భద్రతా చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇవన్నీ పాక్తో సరిహద్దు కలిగిన ప్రాంతాలు కావడంతో మరింత పటిష్టమై భద్రతా ఏర్పా్ట్లను చేయాలని సూచించారు. అయితే, ప్రస్తుతం పాక్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉండటంతో.. సరిహద్దు జిల్లాల్లో అధికార యంత్రాంగం అలర్టైంది. ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలకు తగిన సూచనలు ఇస్తున్నారు.
Read Also: Operation Sindoor : నిన్న పాక్ అవాక్స్ వ్యవస్థను భారత్ కూల్చేసిందా.. పాక్ కు పెద్ద దెబ్బే
మరోవైపు, భారత్- పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే రక్షణ శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఆర్థిక, హోం, ఆరోగ్య శాఖల్లోనూ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. తమ మంత్రి వర్గంలోని ఉన్నతాధికారులతో ఆయా కేంద్రమంత్రులు వరుస సమావేశాలు అవుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు, ఆర్థికపరంగా సన్నద్ధత, ఆరోగ్య సేవల అందుబాటు తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!