PM Narandra Modi: టార్గెట్ 2024.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narandra Modi: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశమై, కీలక పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రుల మండలి సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది ముఖ్యమంత్రులు, ఎనిమిది మంది ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కూడా పాల్గొన్నారు. గతంలో ఇలాంటి చివరి సమావేశం 2021 డిసెంబర్లో వారణాసిలో జరిగింది. ఈ సమావేశంలో, ప్రధాని మోదీ గతిశక్తి, హర్ ఘర్ జల్, స్వామిత్వ, డీబీటీ అమలు, ప్రభుత్వ ఇ-మార్కెట్ప్లేస్ వంటి కొన్ని కీలక పథకాలు, కార్యక్రమాలను ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరింత మెరుగ్గా అమలు చేయాలని ఉద్ఘాటించారు.
గ్రామీణ ప్రాంతాల గురించి మాట్లాడుతూ.. గోబర్ధన్ వెబ్ పోర్టల్ ప్రాముఖ్యత, అవసరం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. పంట ఉత్పాదకతపై నానో-ఎరువుల యొక్క సానుకూల ప్రభావం గురించి ఆయన వివరించారు. వాటి వినియోగాన్ని పెంచడం గురించి మాట్లాడారు. అన్ని కీలక పథకాల సంతృప్త స్థాయి కవరేజీని నిర్ధారించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ దిశగా ముందడుగు వేయాలని అన్నారు. సులభతరమైన వ్యాపారాన్ని పెంపొందించాల్సిన అవసరం గురించి ప్రధాని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. దేశంలో వ్యాపార వాతావరణాన్ని మరింత పెంచే దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రోత్సహించారు.
Also Read
President Ramnath Kovind: రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ చివరి ప్రసంగం.. ఆయన సందేశమిదే..
తమ రాష్ట్రాలు క్రీడలకు సముచితమైన ప్రాధాన్యతనిచ్చేలా చూడాలని.. యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి, నిమగ్నమయ్యేలా ప్రోత్సహించడానికి అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాలని ప్రధానమంత్రులను ప్రధాని మోదీ కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు తమ క్రీడా సంస్కృతిని పెంపొందించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. అన్ని పట్టణాలు, గ్రామాలు, నగరాలు తమ వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు.ఈ సమావేశంలో ఈ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రతి పథకం కూడా మారుమూల గ్రామాల వరకు, అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమృత్ సరోవర్ మిషన్ పురోగతి, హర్ ఘర్ తిరంగా ప్రచారానికి సంబంధించిన సన్నాహాలను కూడా సమీక్షించారు. సుపరిపాలన ద్వారా ఆజాదీ కా అమృత్కాల్ను అంత్యోదయ యుగంగా మార్చేందుకు సీఎంలందరూ కట్టుబడి ఉండాలన్నారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?