PM Modi: కాశ్మీర్లో పీఎం మోడీ మెగా ర్యాలీ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాశ్మీర్ వేదిగకా మెగా ర్యాలీకి సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అనంత్నాగ్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ కాశ్మీర్ లోయలో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ కాశ్మీర్లో ఈ ఎన్నికల ర్యాలీని నిర్వహించబోతోంది.
Read Also: Heart attack: గుండెపోటుతో భర్త, ఏడో అంతస్తు నుంచి దూకి భార్య.. 24 గంటల్లో రెండు మరణాలు..
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
అయితే, ఈ ర్యాలీకి సంబంధించి ఖచ్చితమైన తేదీ తెలియనప్పటికీ.. మార్చి 14 నుంచి 17 మధ్య ఏ రోజయినా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్, కుల్గాం, అనంత్నాగ్, జమ్మూలోని రాజౌరీ-పూంచ్ ప్రాంతాలతో కూడిన అనంతనాగ్-రాజౌరీ లోక్సభ స్థానంపై బీజేపీ దృష్టి సారించింది. 2019లో ఈ ఎంపీ స్థానాన్ని నేషనల్ కాన్ఫరెన్స్కి చెందిన జస్టిస్ (రిటైర్డ్) హస్నైన్ మసూది గెలుచుకున్నారు.
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని 2019 ఆగస్టులో రద్దు చేసిన తర్వాత ప్రధాని తొలిసారిగా కాశ్మీర్ లోయలో పర్యటించనున్నారు. అయితే, గత రెండు నెలల్లో ప్రధాని జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం రెండోసారి. ఫిబ్రవరి 20న జమ్మూలో జరిగిన ఒక బహిరంగ ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు, ఈ సందర్భంగా మొత్తం రూ. 32,000 కోట్లకు పైగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!