Bihar: ఎన్నికల వేళ బీహార్ మహిళలకు మోడీ దసరా కానుక.. ఖాతాల్లో రూ.10 వేలు జమ
- ఎన్నికల వేళ బీహార్ మహిళలకు మోడీ దసరా కానుక
- మహిళా రోజ్గార్ యోజన పథకం ప్రారంభం
- ఖాతాల్లో రూ.10 వేలు జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు దసరా కానుక అందింది. శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Netanyahu: అరెస్ట్ భయంతో నెతన్యాహు అమెరికాకు ఎలా వెళ్లారంటే..!
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ఈ పవిత్ర నవరాత్రి పండుగలో మహిళల ఆశీస్సులు తమకు గొప్ప బలం అని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు మోడీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సోదరీమణులందరికీ ఈరోజు రూ.10 వేలు చేరుతాయని చెప్పారు. ఒకప్పుడు దోపిడీ ఎలా జరిగిందో అందరికీ తెలిసిందేనని.. గతంలో ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపిస్తే.. చివరికి 15 పైసలు మాత్రమే చేరేదని ఆరోపించారు. మధ్యలో దోచుకునే వారు ఉండడంతో చాలా అన్యాయం జరిగిందని వివరించారు. ఇప్పుడు అలా కాకుండా నేరుగా అకౌంట్లలో రూ. 10 వేలు పడిపోతున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Students Protest: ఆంధ్రా యూనివర్సిటీలో టెన్షన్.. టెన్షన్..
తన సోదరి ఆరోగ్యంగా.. సంతోషంగా ఉన్నప్పుడే, కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే సోదరుడు సంతోషంగా ఉంటాడని పేర్కొన్నారు. ఇందుకోసం మీ సోదరుడు అవసరమైంది చేస్తాడని తెలిపారు. ఈరోజు ఇద్దరు సోదరులు మోడీ, నితీష్ కుమార్.. మీ శ్రేయస్సు కోసం, ఆత్మగౌరవం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు నేటి పనే దీనికి ఉదాహరణ అన్నారు. ఈ పథకం గురించి నితీష్ కుమార్ చెప్పినప్పుడు దార్శనికతను చూసి చాలా సంతోషించినట్లు తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ కచ్చితంగా లబ్ధి పొందుతుందని వివరించారు.
మన కుమార్తెలు ఇప్పుడు యుద్ధ విమానాలు నడుపుతున్నారని.. కానీ ఒకప్పుడు బీహార్లో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పటి రోజులు ఎవరూ మరిచిపోకూడదన్నారు. అదంతా లాంతరు పాలన.. ఆ సమయంలో మహిళలు అక్రమం, అవినీతి భారాన్ని భరించారని గుర్తుచేశారు. అప్పట్లో ప్రధాన రోడ్లు శిథిలావస్థకు చేరినప్పుడు.. ఎక్కువగా మహిళలే ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గర్భిణీ స్త్రీలు సకాలంలో ఆస్పత్రులకు చేరుకోలేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారని జ్ఞాపకం చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకుండా రాత్రింబవళ్లు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మోడీ చెప్పుకొచ్చారు.
#WATCH | On launching Bihar's Mukhyamantri Mahila Rojgar Yojana, PM Modi says, "A brother feels happy when his sister is healthy, happy, and her family is financially strong, and for this, the brother does whatever is needed. Today, your two brothers Narendra and Nitish ji are… pic.twitter.com/xthDN9pr8I
— ANI (@ANI) September 26, 2025
తాజావార్తలు
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..