PM Modi: న్యూ ఓర్లీన్స్లో ఉగ్రవాదుల దాడిని ఖండించిన మోడీ
- న్యూ ఓర్లీన్స్లో ఉగ్రవాదుల దాడిని ఖండించిన మోడీ
- పిరికిచర్యగా అభివర్ణించిన ప్రధాని మోడీ
- మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో నూతన సంవత్సరం రోజున జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని మోడీ ఖండించారు. న్యూ ఓర్లీన్స్లో ఒక పికప్ ట్రక్కు అత్యంత వేగంగా జనాలపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా… పలువురు గాయపడ్డారు. తాజాగా ఈ దాడిని ప్రధాని మోడీ ఖండించారు. పిరికిచర్యగా అభివర్ణించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని.. మృతుల కుటుంబాలు సంతాపం వ్యక్తం చేస్తూ.. దు:ఖంలోంచి బయట పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ధైర్యం, నెమ్మది లభించాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ ట్విట్టర్లో మోడీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Indian Snakeroot: ఈ ఒక్క మొక్క పెంచండి.. మీ ఇంటి పరిసరాల్లో పాములు అస్సలు రావు..
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
న్యూఇయర్ సందర్భంగా న్యూ ఓర్లీన్స్ ప్రఖ్యాత ఫ్రెంచ్ క్వార్టర్లో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ప్రజలు ఆనందోత్సవాలతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఇంతలోనే ఒక డ్రైవర్ మారణహోమం సృష్టించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. నిందితుడిని అంతమొందించారు. ఇక ఈ ఘటనలో 15 మంది చనిపోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు కోలుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Shankar: హాలీవుడ్ ఇండియన్ సినిమా వైపు చూస్తోంది.. శంకర్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ట్రక్కుపై ఐఎస్ఐఎస్ గ్రూప్నకు చెందిన జెండా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ దాడిని ఉగ్ర దాడిగా పేర్కొంటున్నట్లు ఎఫ్బీఐ తెలిపింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
We strongly condemn the cowardly terrorist attack in New Orleans. Our thoughts and prayers are with the victims and their families. May they find strength and solace as they heal from this tragedy.
— Narendra Modi (@narendramodi) January 2, 2025
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!