PM Modi: న్యూ ఓర్లీన్స్లో ఉగ్రవాదుల దాడిని ఖండించిన మోడీ
- న్యూ ఓర్లీన్స్లో ఉగ్రవాదుల దాడిని ఖండించిన మోడీ
- పిరికిచర్యగా అభివర్ణించిన ప్రధాని మోడీ
- మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం
అగ్ర రాజ్యం అమెరికాలో నూతన సంవత్సరం రోజున జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని మోడీ ఖండించారు. న్యూ ఓర్లీన్స్లో ఒక పికప్ ట్రక్కు అత్యంత వేగంగా జనాలపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా… పలువురు గాయపడ్డారు. తాజాగా ఈ దాడిని ప్రధాని మోడీ ఖండించారు. పిరికిచర్యగా అభివర్ణించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని.. మృతుల కుటుంబాలు సంతాపం వ్యక్తం చేస్తూ.. దు:ఖంలోంచి బయట పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ధైర్యం, నెమ్మది లభించాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ ట్విట్టర్లో మోడీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Indian Snakeroot: ఈ ఒక్క మొక్క పెంచండి.. మీ ఇంటి పరిసరాల్లో పాములు అస్సలు రావు..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
న్యూఇయర్ సందర్భంగా న్యూ ఓర్లీన్స్ ప్రఖ్యాత ఫ్రెంచ్ క్వార్టర్లో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ప్రజలు ఆనందోత్సవాలతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఇంతలోనే ఒక డ్రైవర్ మారణహోమం సృష్టించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. నిందితుడిని అంతమొందించారు. ఇక ఈ ఘటనలో 15 మంది చనిపోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు కోలుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Shankar: హాలీవుడ్ ఇండియన్ సినిమా వైపు చూస్తోంది.. శంకర్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ట్రక్కుపై ఐఎస్ఐఎస్ గ్రూప్నకు చెందిన జెండా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ దాడిని ఉగ్ర దాడిగా పేర్కొంటున్నట్లు ఎఫ్బీఐ తెలిపింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
We strongly condemn the cowardly terrorist attack in New Orleans. Our thoughts and prayers are with the victims and their families. May they find strength and solace as they heal from this tragedy.
— Narendra Modi (@narendramodi) January 2, 2025
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!