Aurangzeb tomb: ఔరంగజేబు సమాధి కూల్చివేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్..
- ఔరంగజేబు సమాధిని తొలగించాలని బాంబే హైకోర్టులో పిల్..
- జాతీయ స్మారక చిహ్నాల జాబితా నుండి తొలగించాలని కోరిన పిటిషనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aurangzeb tomb: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్(ఔరంగాబాద్) జిల్లాలోని ఖుల్దాబాద్లో ఉన్న మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఔరంగజేబు సమాధిని జాతీయ స్మారక చిహ్నాల జాబితా నుండి తొలగించాలని భారత పురావస్తు సర్వే (ASI)ని ఆదేశించాలని కార్యకర్త కేతన్ తిరోద్కర్ తన పిటిషన్లో కోర్టుని కోరారు. ఔరంగజేబు సమాధి ఏఎస్ఐ చట్టం 1958లోని సెక్షన్ 3కి అనుగుణంగా లేదని వాదిస్తోంది. ఈ సెక్షన్ కొన్ని పురాతన స్మారక చిహ్నాలను, పురావస్తు ప్రదేశాలను జాతీయ ప్రాముఖ్యత కలిగినవిగా పేర్కొంటుంది.
ఔరంగజేబు సమాధి 14వ శతాబ్ధపు చిష్టి సాధువు షేక్ జైనుద్దీన్ దర్గా సముదాయంలో ఉంది. దీనికి సమీపంలోనే ఔరంగజేబు కొడుకుల్లో ఒకరి సమాధితో పాటు హైదరాబాద్ మొదటి నిజాం అసఫ్ జా 1, అతడి కుమారుడు నాసిర్ జంగ్ సమాధులు కూడా ఉన్నాయి. ఈ సమాధులను కూడా కూల్చివేయాలని పిటిషన్లో కోరుతున్నారు.
Also Read
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
Read Also: Electronics Premier League: ఐపీఎల్ 2025 కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేక డీల్స్!
జాతీయ ప్రాముఖ్యత అంటే ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా సమూహం కంటే దేశానికి విలువైనదిగా ఉండాలని పేర్కొంటుందని, దాని ప్రాముఖ్యత మొత్తం దేశంపై ప్రభావం చూపుతుందని నిర్వచిస్తుందని, దీని ప్రభావాన్ని భవిష్యత్ తరాలు సానుకూల రీతిలో అర్థం చేసుకోవాలని వాదిస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. ‘‘ఔరంగజేబు సమాధి జాతీయ ప్రాముఖ్యతను సూచిస్తూ, ఒక జాతీయ స్మారక చిహ్నంగా ఉండటం అనేది స్వయంగా చేసుకున్న అవమానం. భారతదేశంలో చెంఘిజ్ ఖాన్, మొహమ్మద్ ఘోరీ,అలెగ్జాండర్ వంటి వ్యక్తులకు మనం ఎప్పుడూ స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయలేదు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇటీవల విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా తర్వాత ఔరంగజేబు సమాధిని మరాఠా గడ్డపై నుంచి తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సినిమా తర్వాత మహారాష్ట్రలో భావోద్వేగాలు బలపడ్డాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ని ఔరంగజేబు హింసించి చంపడంపై కొందరు ఎమోషనల్ అవుతున్నారు. దీంతో ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల నాగ్పూర్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
తాజావార్తలు
-
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?