Aurangzeb tomb: ఔరంగజేబు సమాధి కూల్చివేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్..
- ఔరంగజేబు సమాధిని తొలగించాలని బాంబే హైకోర్టులో పిల్..
- జాతీయ స్మారక చిహ్నాల జాబితా నుండి తొలగించాలని కోరిన పిటిషనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aurangzeb tomb: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్(ఔరంగాబాద్) జిల్లాలోని ఖుల్దాబాద్లో ఉన్న మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఔరంగజేబు సమాధిని జాతీయ స్మారక చిహ్నాల జాబితా నుండి తొలగించాలని భారత పురావస్తు సర్వే (ASI)ని ఆదేశించాలని కార్యకర్త కేతన్ తిరోద్కర్ తన పిటిషన్లో కోర్టుని కోరారు. ఔరంగజేబు సమాధి ఏఎస్ఐ చట్టం 1958లోని సెక్షన్ 3కి అనుగుణంగా లేదని వాదిస్తోంది. ఈ సెక్షన్ కొన్ని పురాతన స్మారక చిహ్నాలను, పురావస్తు ప్రదేశాలను జాతీయ ప్రాముఖ్యత కలిగినవిగా పేర్కొంటుంది.
ఔరంగజేబు సమాధి 14వ శతాబ్ధపు చిష్టి సాధువు షేక్ జైనుద్దీన్ దర్గా సముదాయంలో ఉంది. దీనికి సమీపంలోనే ఔరంగజేబు కొడుకుల్లో ఒకరి సమాధితో పాటు హైదరాబాద్ మొదటి నిజాం అసఫ్ జా 1, అతడి కుమారుడు నాసిర్ జంగ్ సమాధులు కూడా ఉన్నాయి. ఈ సమాధులను కూడా కూల్చివేయాలని పిటిషన్లో కోరుతున్నారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: Electronics Premier League: ఐపీఎల్ 2025 కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేక డీల్స్!
జాతీయ ప్రాముఖ్యత అంటే ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా సమూహం కంటే దేశానికి విలువైనదిగా ఉండాలని పేర్కొంటుందని, దాని ప్రాముఖ్యత మొత్తం దేశంపై ప్రభావం చూపుతుందని నిర్వచిస్తుందని, దీని ప్రభావాన్ని భవిష్యత్ తరాలు సానుకూల రీతిలో అర్థం చేసుకోవాలని వాదిస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. ‘‘ఔరంగజేబు సమాధి జాతీయ ప్రాముఖ్యతను సూచిస్తూ, ఒక జాతీయ స్మారక చిహ్నంగా ఉండటం అనేది స్వయంగా చేసుకున్న అవమానం. భారతదేశంలో చెంఘిజ్ ఖాన్, మొహమ్మద్ ఘోరీ,అలెగ్జాండర్ వంటి వ్యక్తులకు మనం ఎప్పుడూ స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయలేదు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇటీవల విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా తర్వాత ఔరంగజేబు సమాధిని మరాఠా గడ్డపై నుంచి తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సినిమా తర్వాత మహారాష్ట్రలో భావోద్వేగాలు బలపడ్డాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ని ఔరంగజేబు హింసించి చంపడంపై కొందరు ఎమోషనల్ అవుతున్నారు. దీంతో ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల నాగ్పూర్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!