Petrol Price At AP: పెట్రోల్ ధరలు అక్కడే ఎక్కువ.. ఎందుకంటే?
Petrol Price At AP: పెట్రోల్ ధరలు సెంచరీ దాటి.. నూటి పది కూడా దాటింది. అయితే అత్యధికంగా ఏ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధర ఎక్కడ ఎక్కువగా ఉందో తెలుసా? పెట్రోల్ ధరలపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పన్నులు ఎక్కువగా ఉండటంతో సెంచరీ మార్కును దాటేసింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, బ్యారెల్ ధర తగ్గినప్పటికీ ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవు. కారణం ఏమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు. వాస్తవ పెట్రోలియం ధర కంటే పన్నులు అధికంగా ఉండటంతో.. ధరలు సెంచరీ మార్క్ ను దాటేశాయి. 15 ఏళ్ల క్రితం రూ. 30లోపు లీటర్ ఉన్న పెట్రోల్ ధర కాస్త.. ఇపుడు రూ. 110కి చేరింది. అయితే వీటికి తోడు మరో షాకింగ్ విషయం ఏమిటంటే పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర నూటపది దాటేసింది. దేశంలో ఏపీలోనే పెట్రోల్ ధర అధికంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.87 ఉన్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్పురి వెల్లడించారు.
Read also: Tomato: నా టమాటాలు పోయాయి సార్.. పూణెలో పోలీస్ స్టేషన్లో మొదటి కంప్లైంట్
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పెట్రో ఉత్పత్తులపై దేశమంతా ఒకే ధరల విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదా? అని రాజస్థాన్ బీజేపీ ఎంపీ రాహుల్ కశ్వాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పన్ను ఆ ధారంగా ఆయా రాష్ర్టాల్లో పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తుల ధరలు ఉన్నాయని వివరించారు. జూలై 18 వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల రాజధాని నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల వివరాలను మంత్రి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీ కంటే తెలంగాణలోనే ధరలు తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 109.66, డీజిల్ ధర రూ.97.82గా ఉన్నది. కేరళలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.73 కాగా, డీజిల్ ధర రూ.98.53గా ఉన్నది. అయితే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం అజమాయిషీ ఉండాలని.. ప్రజలు నిత్యం వాడే పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో మాదిరిగా ధరల నియంత్రణ పెట్రోలియం సంస్థల చేతుల్లో కాకుండా కేంద్రం చేతిలో ఉండాలని కోరుతున్నారు.
- Tags
- At AP
- Higher
- people
- petrol price
- taxes
తాజావార్తలు
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో