Tomato: నా టమాటాలు పోయాయి సార్.. పూణెలో పోలీస్ స్టేషన్లో మొదటి కంప్లైంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato: రైతులకు ఉల్లి, టమాటా సాగు అధిక రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పంటల సరఫరా విషయంలో ఎప్పుడూ అనిశ్చితి ఉంటుంది. ఈ పంట సాగుకు అయ్యే ఖర్చుకు, కోతకు వచ్చే ఖర్చుకు వ్యత్యాసం చాలా ఉంటుంది. దీంతో ఈ సరుకులను మార్కెట్ కమిటీకి తీసుకెళ్లకుండా రైతులు పలుమార్లు ఉల్లి, టమాటాలను రోడ్డుపై పడేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం రైతుల పంట పండింది. టమాటాల ధర మోతమోగింది. ఈ పంట ద్వారా రైతులు చాలామంది కోటీశ్వరులయ్యారు. దీంతో ఈ పంటపై దొంగల కళ్లు పడ్డాయి. పూణె జిల్లాలో 400 కిలోల టమాటాలు చోరీకి గురైన ఘటన చోటుచేసుకుంది.
Read Also:Virat Kohli Unique Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
శిరూర్ తాలూకా పింపర్ఖేడ్ గ్రామానికి చెందిన అరుణ్ బాలు ధోమే అనే రైతు రెండెకరాల పొలంలో టమాటా వేశాడు. సోమవారం జూలై 17 అతను మార్కెట్లో విక్రయించడానికి టమాటాలను కోసాడు. ఉదయం మార్కెట్ వద్దకు వెళ్లి టమాటా విక్రయించేందుకు 400 కిలోల టమాటాలను ఆటోలో ఉంచాడు. వస్తువులు 20ట్రేలలో ఉన్నాయి. పడుకునే ముందు మళ్లీ ఆటోలో టమాటాలు ఉన్నాయా అని చెక్ చేసుకున్నాడు. అనంతరం మంగళవారం మార్కెట్కు టమాటాలు తీసుకెళ్దామని లేచి చూసే సరికి ఆటోలో టమాటాలు లేవు. అతను, తన కుటుంబ సభ్యులు టమాటాల కోసం చాలా చోట్ల వెతికారు. కానీ వాటి ఆచూకీ లభించలేదు.
Read Also:America: విద్యార్థినిపై పిడుగుపాటు.. అమెరికాలో ఘటన
ధోమ్ కుటుంబీకులు అన్ని చోట్ల వెతికినా టమోటాలు దొరకలేదు. దీంతో ఆయన శిరూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.20 వేల విలువైన 400 కిలోల టమాటాలు చోరీకి గురైనట్లు కేసు నమోదు చేశారు. ఇప్పుడు శిరూర్ పోలీసులు ఆ టమాటా దొంగను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ప్రస్తుతం టమాట దొంగతనం హాట్ టాపిక్ గా మారింది. పెరిగిన టమోటా ధరపై నటుడు సునీల్ శెట్టి ప్రకటన చేశారు. టమాటా ధర పెరగడం వల్ల తన వంటింట్లో టమాటా వినియోగం తగ్గిపోయిందన్నారు. ఆయన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత సునీల్ శెట్టి క్షమాపణలు చెప్పాడు. సునీల్ శెట్టి తన ప్రకటనను వక్రీకరించారని, రైతులకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
- Tags
- Crime News
- FARMER NEWS
- Pune
- tomato
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!