Flight Crash: విమానంలో లోపాన్ని ముందే గుర్తించిన యువకుడు.. సంచలన విషయాలు వెల్లడి..!
- అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం
- ముందుగానే విమానంలో సాంకేతిక లోపాలు గుర్తింపు
- ఏసీలు సైతం పని చేయడం లేదని యువకుడు ట్వీట్
- కూలడానికి ముందు పలు లోపాలను గుర్తించిన ఆకాశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లోని అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో కొన్ని సమస్యలను గుర్తించినట్లు ఆకాశ్ వత్స అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. విమానం కూలడానికి రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు ఆ విమానంలో ప్రయాణించినట్లు చెప్పాడు. ఆ విమానంలో తాను ఎదుర్కొన్న సమస్యలను ఆకాశ్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. ‘అహ్మదాబాద్ నుంచి బయలుదేరడానికి రెండు గంటల ముందు ఆ విమానంలో నేను ఉన్నా. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు అందులో ప్రయాణించా. ఆ విమానంలో అసాధారణమైన విషయాలను గమనించా’ అని తెలిపాడు. తాజాగా ఈ అంశంపై మరోసారి ఆకాశ్ స్పందించాడు. జరిగిన విషయాన్ని క్లూప్తంగా వివరించాడు.
READ MORE: Pawan Kalyan: లోయలోకి పవన్ కళ్యాణ్ పరుగులు.. అందుకేగా రియల్ హీరో అనేది!
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
“అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఆ విమానంలో నేను ప్రయాణించాను. విమానం కూలి పోకంటే ముందకు ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ఈ బోయింగ్ 787 డ్రీమ్లైనర్లో నేను ప్రయాణించాను. విమానం టేకాఫ్ చేయడానికి ముందు గ్రౌండ్పై ఉన్నప్పుడు ఏసీలు సరిగ్గా పనిచేయలేదు. గాల్లో ఉన్నపుడు ఫ్లాప్స్ వెనుక భాగం పదే పదే పైకి, కిందకు కదులుతున్నట్లు గమనించాను. విమానంలో ఏసీలు కూడా పని చేయలేదు. విమానానికి గరిష్ట శక్తిని అందించడానికి ఏసీలను ఆఫ్ చేయడం సాధారణమని చాలామంది ఏవియేషన్ నిపుణులు చెప్పారు. అయినా.. ఈ అంశంపై ఫిర్యాదు చేయడానికి నేను ప్రయత్నించాను. కానీ విమానం టేకాఫ్కు సిద్ధంగా ఉండటంతో సిబ్బంది తొందరలో ఉన్నారు.. ఏసీ ఆన్ చేసిన తర్వాత కూడా దాని ఉష్ణోగ్రత మారుతూనే ఉంది. విమానం దిగి షటిల్ బస్సు ఎక్కినప్పుడు చాలామంది ప్రయాణికులు విమానం ఏసీ కంటే బస్సులోని ఏసీ.. చల్లగా ఉందని భావించారు. ఇదంతా ఎందుకు రికార్డు చేయలేదు అని నన్ను అడుతున్నారు. నేను ట్రావెలర్ని కాదు.. సాధారణ ప్రయాణికుడి. ఇప్పుడు విమానం కూలి పోయింది కాబట్టి నేను ఈ ప్రూఫ్ను బయటపెట్టాను.” అని ఆకాశ్ వత్స వెల్లడించాడు. ఇప్పుడు ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
READ MORE: Plane Crash: “1206”ను అదృష్ట సంఖ్యగా భావించిన మాజీ సీఎం.. అదే తేదీన మృత్యుఒడికి…
#WATCH | #AirIndiaPlaneCrash | Mumbai | Akash Vatsa, who claimed in a viral tweet yesterday that he flew in the same Boeing 787 Dreamliner from Delhi to Ahmedabad, hours before it crashed soon after take off while flying as Air India flight AI171 from Ahmedabad to London, spoke… pic.twitter.com/16cQ1p5Gwk
— ANI (@ANI) June 13, 2025
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!