Flight Crash: విమానంలో లోపాన్ని ముందే గుర్తించిన యువకుడు.. సంచలన విషయాలు వెల్లడి..!
- అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం
- ముందుగానే విమానంలో సాంకేతిక లోపాలు గుర్తింపు
- ఏసీలు సైతం పని చేయడం లేదని యువకుడు ట్వీట్
- కూలడానికి ముందు పలు లోపాలను గుర్తించిన ఆకాశ్
గుజరాత్లోని అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో కొన్ని సమస్యలను గుర్తించినట్లు ఆకాశ్ వత్స అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. విమానం కూలడానికి రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు ఆ విమానంలో ప్రయాణించినట్లు చెప్పాడు. ఆ విమానంలో తాను ఎదుర్కొన్న సమస్యలను ఆకాశ్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. ‘అహ్మదాబాద్ నుంచి బయలుదేరడానికి రెండు గంటల ముందు ఆ విమానంలో నేను ఉన్నా. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు అందులో ప్రయాణించా. ఆ విమానంలో అసాధారణమైన విషయాలను గమనించా’ అని తెలిపాడు. తాజాగా ఈ అంశంపై మరోసారి ఆకాశ్ స్పందించాడు. జరిగిన విషయాన్ని క్లూప్తంగా వివరించాడు.
READ MORE: Pawan Kalyan: లోయలోకి పవన్ కళ్యాణ్ పరుగులు.. అందుకేగా రియల్ హీరో అనేది!
Also Read
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
“అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఆ విమానంలో నేను ప్రయాణించాను. విమానం కూలి పోకంటే ముందకు ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ఈ బోయింగ్ 787 డ్రీమ్లైనర్లో నేను ప్రయాణించాను. విమానం టేకాఫ్ చేయడానికి ముందు గ్రౌండ్పై ఉన్నప్పుడు ఏసీలు సరిగ్గా పనిచేయలేదు. గాల్లో ఉన్నపుడు ఫ్లాప్స్ వెనుక భాగం పదే పదే పైకి, కిందకు కదులుతున్నట్లు గమనించాను. విమానంలో ఏసీలు కూడా పని చేయలేదు. విమానానికి గరిష్ట శక్తిని అందించడానికి ఏసీలను ఆఫ్ చేయడం సాధారణమని చాలామంది ఏవియేషన్ నిపుణులు చెప్పారు. అయినా.. ఈ అంశంపై ఫిర్యాదు చేయడానికి నేను ప్రయత్నించాను. కానీ విమానం టేకాఫ్కు సిద్ధంగా ఉండటంతో సిబ్బంది తొందరలో ఉన్నారు.. ఏసీ ఆన్ చేసిన తర్వాత కూడా దాని ఉష్ణోగ్రత మారుతూనే ఉంది. విమానం దిగి షటిల్ బస్సు ఎక్కినప్పుడు చాలామంది ప్రయాణికులు విమానం ఏసీ కంటే బస్సులోని ఏసీ.. చల్లగా ఉందని భావించారు. ఇదంతా ఎందుకు రికార్డు చేయలేదు అని నన్ను అడుతున్నారు. నేను ట్రావెలర్ని కాదు.. సాధారణ ప్రయాణికుడి. ఇప్పుడు విమానం కూలి పోయింది కాబట్టి నేను ఈ ప్రూఫ్ను బయటపెట్టాను.” అని ఆకాశ్ వత్స వెల్లడించాడు. ఇప్పుడు ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
READ MORE: Plane Crash: “1206”ను అదృష్ట సంఖ్యగా భావించిన మాజీ సీఎం.. అదే తేదీన మృత్యుఒడికి…
#WATCH | #AirIndiaPlaneCrash | Mumbai | Akash Vatsa, who claimed in a viral tweet yesterday that he flew in the same Boeing 787 Dreamliner from Delhi to Ahmedabad, hours before it crashed soon after take off while flying as Air India flight AI171 from Ahmedabad to London, spoke… pic.twitter.com/16cQ1p5Gwk
— ANI (@ANI) June 13, 2025
తాజావార్తలు
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో