Flight Crash: విమానంలో లోపాన్ని ముందే గుర్తించిన యువకుడు.. సంచలన విషయాలు వెల్లడి..!
- అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం
- ముందుగానే విమానంలో సాంకేతిక లోపాలు గుర్తింపు
- ఏసీలు సైతం పని చేయడం లేదని యువకుడు ట్వీట్
- కూలడానికి ముందు పలు లోపాలను గుర్తించిన ఆకాశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లోని అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో కొన్ని సమస్యలను గుర్తించినట్లు ఆకాశ్ వత్స అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. విమానం కూలడానికి రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు ఆ విమానంలో ప్రయాణించినట్లు చెప్పాడు. ఆ విమానంలో తాను ఎదుర్కొన్న సమస్యలను ఆకాశ్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. ‘అహ్మదాబాద్ నుంచి బయలుదేరడానికి రెండు గంటల ముందు ఆ విమానంలో నేను ఉన్నా. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు అందులో ప్రయాణించా. ఆ విమానంలో అసాధారణమైన విషయాలను గమనించా’ అని తెలిపాడు. తాజాగా ఈ అంశంపై మరోసారి ఆకాశ్ స్పందించాడు. జరిగిన విషయాన్ని క్లూప్తంగా వివరించాడు.
READ MORE: Pawan Kalyan: లోయలోకి పవన్ కళ్యాణ్ పరుగులు.. అందుకేగా రియల్ హీరో అనేది!
Also Read
“అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఆ విమానంలో నేను ప్రయాణించాను. విమానం కూలి పోకంటే ముందకు ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ఈ బోయింగ్ 787 డ్రీమ్లైనర్లో నేను ప్రయాణించాను. విమానం టేకాఫ్ చేయడానికి ముందు గ్రౌండ్పై ఉన్నప్పుడు ఏసీలు సరిగ్గా పనిచేయలేదు. గాల్లో ఉన్నపుడు ఫ్లాప్స్ వెనుక భాగం పదే పదే పైకి, కిందకు కదులుతున్నట్లు గమనించాను. విమానంలో ఏసీలు కూడా పని చేయలేదు. విమానానికి గరిష్ట శక్తిని అందించడానికి ఏసీలను ఆఫ్ చేయడం సాధారణమని చాలామంది ఏవియేషన్ నిపుణులు చెప్పారు. అయినా.. ఈ అంశంపై ఫిర్యాదు చేయడానికి నేను ప్రయత్నించాను. కానీ విమానం టేకాఫ్కు సిద్ధంగా ఉండటంతో సిబ్బంది తొందరలో ఉన్నారు.. ఏసీ ఆన్ చేసిన తర్వాత కూడా దాని ఉష్ణోగ్రత మారుతూనే ఉంది. విమానం దిగి షటిల్ బస్సు ఎక్కినప్పుడు చాలామంది ప్రయాణికులు విమానం ఏసీ కంటే బస్సులోని ఏసీ.. చల్లగా ఉందని భావించారు. ఇదంతా ఎందుకు రికార్డు చేయలేదు అని నన్ను అడుతున్నారు. నేను ట్రావెలర్ని కాదు.. సాధారణ ప్రయాణికుడి. ఇప్పుడు విమానం కూలి పోయింది కాబట్టి నేను ఈ ప్రూఫ్ను బయటపెట్టాను.” అని ఆకాశ్ వత్స వెల్లడించాడు. ఇప్పుడు ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
READ MORE: Plane Crash: “1206”ను అదృష్ట సంఖ్యగా భావించిన మాజీ సీఎం.. అదే తేదీన మృత్యుఒడికి…
#WATCH | #AirIndiaPlaneCrash | Mumbai | Akash Vatsa, who claimed in a viral tweet yesterday that he flew in the same Boeing 787 Dreamliner from Delhi to Ahmedabad, hours before it crashed soon after take off while flying as Air India flight AI171 from Ahmedabad to London, spoke… pic.twitter.com/16cQ1p5Gwk
— ANI (@ANI) June 13, 2025
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!