Parliament Monsoon Session: ‘‘ఆపరేషన్ సిందూర్’’పై నేడు పార్లమెంట్లో వాడీవేడీ చర్చ..
- పార్లమెంట్లో నేడు ఆపరేషన్ సిందూర్పై వాడీవేడీ చర్చ..
- వ్యూహాలను సిద్ధం చేసుకున్న అధికార, ప్రతిపక్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు వాడీవేడీ చర్చ జరగబోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు లోక్సభలో చర్చ జరగనుంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సిందూర్పై చర్చకు అధికార పక్షం తరుపు హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగిస్తారు. ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా చర్చలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు.
Read Also: UPI: రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారా?.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
Also Read
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Gurugram Road Rage: మహిళా బైకర్ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
లోక్సభ, రాజ్యసభలోని ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్వాదీ పార్టీ సభ్యుడు అఖిలేష్ యాదవ్ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసి, మూడు రోజులు సభకు హాజరు కావాలని ఆదేశించింది. సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ సోమవారం చర్చకు ప్రతిపక్ష పార్టీల తరుఫున చర్చను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ రోజు లోక్సభలో ఆపరేషన్ సిందూర్పై చర్చ జరగనుండగా, రేపు రాజ్యసభలో చర్చించనున్నారు. రెండు సభల్లో కలిపి చర్చ కోసం 16 గంటలు కేటాయించారు. పాకిస్తాన్పై ఆపరేషన్ జరిగినప్పటి నుంచి, కాంగ్రెస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంపై విమర్శిస్తోంది. మోడీ ప్రభుత్వం ట్రంప్కి తలొగ్గి కాల్పుల విరమణకు ఒప్పుకుందని విమర్శిస్తోంది. ఇదే కాకుండా, ఘర్షణ సమయంలో భారత్ ఎన్ని యుద్ధవిమానాలను కోల్పోయిందో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగనుండటం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!