Parliament Monsoon Session: ‘‘ఆపరేషన్ సిందూర్’’పై నేడు పార్లమెంట్లో వాడీవేడీ చర్చ..
- పార్లమెంట్లో నేడు ఆపరేషన్ సిందూర్పై వాడీవేడీ చర్చ..
- వ్యూహాలను సిద్ధం చేసుకున్న అధికార, ప్రతిపక్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు వాడీవేడీ చర్చ జరగబోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు లోక్సభలో చర్చ జరగనుంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సిందూర్పై చర్చకు అధికార పక్షం తరుపు హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగిస్తారు. ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా చర్చలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు.
Read Also: UPI: రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారా?.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
Also Read
లోక్సభ, రాజ్యసభలోని ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్వాదీ పార్టీ సభ్యుడు అఖిలేష్ యాదవ్ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసి, మూడు రోజులు సభకు హాజరు కావాలని ఆదేశించింది. సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ సోమవారం చర్చకు ప్రతిపక్ష పార్టీల తరుఫున చర్చను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ రోజు లోక్సభలో ఆపరేషన్ సిందూర్పై చర్చ జరగనుండగా, రేపు రాజ్యసభలో చర్చించనున్నారు. రెండు సభల్లో కలిపి చర్చ కోసం 16 గంటలు కేటాయించారు. పాకిస్తాన్పై ఆపరేషన్ జరిగినప్పటి నుంచి, కాంగ్రెస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంపై విమర్శిస్తోంది. మోడీ ప్రభుత్వం ట్రంప్కి తలొగ్గి కాల్పుల విరమణకు ఒప్పుకుందని విమర్శిస్తోంది. ఇదే కాకుండా, ఘర్షణ సమయంలో భారత్ ఎన్ని యుద్ధవిమానాలను కోల్పోయిందో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగనుండటం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!