UPI: రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారా?.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
- రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారా
- క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల స్వరూపమే మారిపోయింది. కిరాణా షాపు నుంచి మొదలుకుని షాపింగ్ మాల్స్ వరకు అన్నింటికి ఆన్ లైన్ ద్వారానే చెల్లింపుల చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారు అనే ఊహాగానాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2000 రూపాయలకు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ఆలోచన ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో స్పష్టం చేసింది . రూ. 2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలనే జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎటువంటి సిఫార్సు లేదని జూలై 22న రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.
Also Read:Mothevari Love Story : ‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్
Also Read
- Rohit Sharma: చరిత్రకు మరో అడుగు దూరంలో రోహిత్ శర్మ.. భారీ స్కెచ్తో బరిలోకి..
- Earthquake: చైనా, జపాన్లో భారీ భూకంపం.. కంపించిన భవనాలు
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- Mission Godavari Clean Project: మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు.. కాలుష్య అధ్యయనానికి కేంద్ర బృందం
2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, జీఎస్టీ రేట్లు, మినహాయింపులు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా నిర్ణయించబడతాయని సభకు తెలిపారు. కర్ణాటకలోని వ్యాపారులకు యూపీఐ లావాదేవీల డేటా ఆధారంగా జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందిన తర్వాత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరణ ఇచ్చారు. కర్ణాటకలోని చిన్న వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ నోటీసులు జారీ చేసిందని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గత వారం తెలిపారు.
Also Read:AP Rains: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ప్రకటనను జోషి చాలా హాస్యాస్పదంగా అభివర్ణించారు. నోటీసు జారీ చేయడంలో రాష్ట్రానికి ఎటువంటి పాత్ర లేదని డికె శివకుమార్ వెల్లడించారు. “చిన్న వ్యాపారులకు జిఎస్టి బకాయిల నోటీసులు జారీ చేసింది కర్ణాటక వాణిజ్య పన్ను అధికారులే. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాని ప్రమేయం లేదని నటిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఇది బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.
Also Read:AP Rains: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు
కేంద్ర ప్రభుత్వం జిఎస్టి నోటీసులు జారీ చేసి ఉంటే, అనేక ఇతర రాష్ట్రాల వ్యాపారులకు అవి అందేవి. అయితే, ఇది మరెక్కడా జరగలేదు. ఈ నోటీసులు కర్ణాటకలో మాత్రమే ఎందుకు పంపబడుతున్నాయి?” అని జోషి ప్రశ్నించారు. జీఎస్టీలో రెండు భాగాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు – కేంద్ర ప్రభుత్వం కింద సీజీఎస్టీ (సెంట్రల్ జీఎస్టీ), రాష్ట్ర ప్రభుత్వాల కింద ఎస్జీఎస్టీ (స్టేట్ జీఎస్టీ). జీఎస్టీ కౌన్సిల్ కేంద్ర, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులతో కూడిన రాజ్యాంగ సంస్థ. కర్ణాటకలోని చిన్న వ్యాపారులకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Rohit Sharma: చరిత్రకు మరో అడుగు దూరంలో రోహిత్ శర్మ.. భారీ స్కెచ్తో బరిలోకి..
-
Earthquake: చైనా, జపాన్లో భారీ భూకంపం.. కంపించిన భవనాలు
-
Mansukh Kaka: శభాష్ తాతా అనాలా? లేక విధి రాతను నిందించాలా?.. 82 ఏళ్ల వయసులో రోడ్డుపై కన్నీటి కష్టం!
-
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్లో భారత సంతతి ఆటగాడి రికార్డ్..
-
Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?