Wrestlers Protest: తాకితే అపార్థం చేసుకుంటారా.. రుజువులున్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panel Asked For Audio Video Proof Says Wreslters: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రెజ్లర్లు కొన్ని రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన చేస్తున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే.. ఈ ఆరోపణలపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే.. ఆ కమిటీ సభ్యులు రెజ్లర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని సమాచారం. రెజ్లర్లను లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో లేదా ఆడియో రుజువులను ఆ కమిటీ సభ్యులు అడిగారట.
Singer Haesoo: ప్రముఖ సింగర్ ఆత్మహత్య.. ఆరోజు ఏం జరిగిందంటే?
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
కమిటిలోని ఒక మెంబర్.. తండ్రిలాంటి బ్రిజ్ భూషణ్ ఏదో తెలియక చనువుగా తాకితే, దాన్నికూడా అపార్థం చేసుకుంటారా? అని తనకు చెప్పినట్లు ఓ మహిళా రెజ్లర్ తెలిపింది. అలాగే.. డబ్ల్యూఎఫ్ఐ సిబ్బంది, కోచ్, బ్రిజ్ భూషణ్ సన్నిహితులందరూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భవనం వెయిటింగ్ ఏరియాలో కిక్కిరిసి ఉన్నారని.. ఇది భయపెట్టేదిగా ఉందని మరో రెజ్లర్ పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే వీళ్లు వచ్చినట్లు ఆ రెజ్లర్ అభిప్రాయపడ్డారు. తమ నుంచి స్టేట్మెంట్లు తీసుకునే సమయంలో పర్యవేక్షణ కమిటీలో కేవలం మహిళా సభ్యులు మాత్రమే గదిలో ఉండాలని తాము చేసిన అభ్యర్థనను సైతం కమిటీ సభ్యులు తిరస్కరించినట్టు మరో రెజ్లర్ తెలిపారు.
ICC New Rules: ఆ మూడు రూల్స్ని సవరించిన ఐసీసీ.. అవేంటంటే?
కాగా.. మే 7వ తేదీన ఇద్దరు రెజ్లర్లు బ్రిజ్ భూషణ్పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో బ్రిజ్భూషణ్ తమ పట్ల పాల్పడ్డ లైంగిక వేధింపుల గురించి వివరించారు. బ్రీతింగ్ టెస్ట్ సాకుతో ఆయన తమ రొమ్ము, నడుము భాగాల్లో చేతులు తాకాడని.. ట్రైనింగ్ సెషన్లో జెర్సీని పైకి లేపాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. విచారణలో భాగంగా తాము సాక్ష్యాలు సమర్పిస్తున్నప్పుడు, కమిటీ సభ్యులు వీడియో రికార్డ్ని స్విచ్చాఫ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని రెజ్లర్లు తమ ఫిర్యాదులో వెల్లడించారు. కాగా.. మాజీ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీని యూనియన్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే!
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!