Pakistan: “భారత దాడికి పాకిస్తాన్ సిద్ధంగా ఉండాలి”.. పీఓకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- భారత దాడికి పాకిస్తాన్ సిద్ధంగా ఉండాలి..
- రియాసి బస్సు అటాక్పై కీలక వ్యాఖ్యలు..
- పీఓకే మాజీ ప్రధాని కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో ఆదివారం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఒక్కసారిగా బస్సులోయలో పడిపోయింది. ఈ దాడిలో 09 మంది మరణించారు. ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేస్తున్న రోజునే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ లష్కరేతోయిబాకు అనుబంధంగా ఉన్న ఉగ్రసంస్థ ప్రకటించింది. ఉగ్రవాదులు ‘జింగిల్ వార్ఫేర్’లో శిక్షణ పొంది, అడవుల్లోని గుహాల్లో రోజుల తరబడి నివసిస్తూ దాడులకు పాల్పడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి మే నెలలో జరిగిన పూంచ్ ఎయిర్ఫోర్స్ కాన్వాయ్ అటాక్కి సంబంధం ఉన్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ఇదిలా ఉంటే, రియాసి టెర్రర్ అటాక్పై పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) మాజీ ప్రధాని రాజా ఫరూఖ్ హైదర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైనిక చర్యకు పాల్పడవచ్చని, పాకిస్తాన్ పూర్తిగా సిద్ధంగా ఉండాలని కోరారు. ఎక్స్ వేదికగా ఒక పోస్టులో.. ‘‘రియాసి దాడిని సాకుగా చూపి ఆజాద్ కాశ్మీర్లో ఏదైనా భారతీయ దుస్సాహసానికి పాకిస్తాన్ పూర్తిగా సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఆదివారం కత్రా నుంచి శివ్ ఖోరీ మందిరానికి ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు ప్లాన్ చేసి దాడికి తెగబడ్డారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లతో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు.
Pakistan should be fully prepared for any Indian misadventure in Azad Kashmir in pretext of Riasi attack
— Raja Muhammad Farooq Haider Khan (@farooq_pm) June 10, 2024
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!