Pakistan: “భారత దాడికి పాకిస్తాన్ సిద్ధంగా ఉండాలి”.. పీఓకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- భారత దాడికి పాకిస్తాన్ సిద్ధంగా ఉండాలి..
- రియాసి బస్సు అటాక్పై కీలక వ్యాఖ్యలు..
- పీఓకే మాజీ ప్రధాని కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో ఆదివారం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఒక్కసారిగా బస్సులోయలో పడిపోయింది. ఈ దాడిలో 09 మంది మరణించారు. ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేస్తున్న రోజునే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ లష్కరేతోయిబాకు అనుబంధంగా ఉన్న ఉగ్రసంస్థ ప్రకటించింది. ఉగ్రవాదులు ‘జింగిల్ వార్ఫేర్’లో శిక్షణ పొంది, అడవుల్లోని గుహాల్లో రోజుల తరబడి నివసిస్తూ దాడులకు పాల్పడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి మే నెలలో జరిగిన పూంచ్ ఎయిర్ఫోర్స్ కాన్వాయ్ అటాక్కి సంబంధం ఉన్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
- Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
ఇదిలా ఉంటే, రియాసి టెర్రర్ అటాక్పై పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) మాజీ ప్రధాని రాజా ఫరూఖ్ హైదర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైనిక చర్యకు పాల్పడవచ్చని, పాకిస్తాన్ పూర్తిగా సిద్ధంగా ఉండాలని కోరారు. ఎక్స్ వేదికగా ఒక పోస్టులో.. ‘‘రియాసి దాడిని సాకుగా చూపి ఆజాద్ కాశ్మీర్లో ఏదైనా భారతీయ దుస్సాహసానికి పాకిస్తాన్ పూర్తిగా సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఆదివారం కత్రా నుంచి శివ్ ఖోరీ మందిరానికి ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు ప్లాన్ చేసి దాడికి తెగబడ్డారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లతో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు.
Pakistan should be fully prepared for any Indian misadventure in Azad Kashmir in pretext of Riasi attack
— Raja Muhammad Farooq Haider Khan (@farooq_pm) June 10, 2024
తాజావార్తలు
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!