Jammu Kashmir: పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న ఆలయ తలుపులు
- ముర్రాన్ గ్రామంలో తెరుచుకున్నఈ బరారీ మౌజ్ ఆలయం తలుపులు
- హోమం నిర్వహించిన ముస్లిం-హిందువులు
- కాశ్మీరీ పండిట్ల ప్రత్యేక పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 30 ఏళ్ల తర్వాత చారిత్రక ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ముర్రాన్ గ్రామంలో తెరిచిన ఈ బరారీ మౌజ్ ఆలయంలో కాశ్మీరీ పండిట్లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముర్రాన్ గ్రామానికి చెందిన పండితులు, ముస్లిం ప్రజలు కలిసి ఆలయ తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు ప్రసాదం పంపిణీ చేశారు. అలాగే ఇరు వర్గాల ప్రజలు కలిసి హోమం చేశాయి. మూడు దశాబ్దాల తర్వాత బరారీ మౌజ్ ఆలయాన్ని తెరవడం పట్ల గ్రామంలోని వలసేతర పండితులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ సమయంలో కాశ్మీరీ పండిట్ మాట్లాడుతూ.. “మేం ఎప్పటికీ ఇక్కడి నుంచి వెళ్లిపోనట్లు భావిస్తున్నాం. మమ్మల్ని ఎప్పుడూ చూడని ముస్లిం యువకులు మమ్మల్ని వారి తల్లిదండ్రుల స్నేహితులుగా చూస్తున్నారు. వారితల్లిదండ్రుల కంటే మమ్మల్ని ఎక్కువగా గౌరవించారు. బరారీ మౌజ్
ఆలయంలో భజనలు పాడే బృందం ముస్లిం సమాజానికి చెందినది. వారు కాశ్మీరీ పండిట్ల కోసం భజనలు చేస్తున్నారు.”
READ MORE: Central Cabinet: కేంద్ర మంత్రుల్లో ఎంత మంది పట్టభద్రులు ఉన్నారో తెలుసా?
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
భవిష్యత్తులో కూడా ఇలాంటి హోమాలు కొనసాగిస్తామని స్థానికులు తెలిపారు. కాగా.. పుల్వామా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వార్తలు వస్తుంటాయని విషయం మీకు తెలిసిందే. ఇది తీవ్రవాదుల కోటగా పరిగణించబడుతుంది. తాజాగా పుల్వామాలో రెండు పేలుడు పదార్థాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీరితో పాటు లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులను కూడా అరెస్టు చేశారు. ఆదివారం ఇక్కడ నుంచి సుమారు ఆరు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, దానిని ధ్వంసం చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఇక్కడ హిందూ- ముస్లింలు కలిసి ఉండటం పూజలు చేయడం స్ఫూర్తిదాయకంగా పరిగణించవచ్చు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!