Jammu Kashmir: పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న ఆలయ తలుపులు
- ముర్రాన్ గ్రామంలో తెరుచుకున్నఈ బరారీ మౌజ్ ఆలయం తలుపులు
- హోమం నిర్వహించిన ముస్లిం-హిందువులు
- కాశ్మీరీ పండిట్ల ప్రత్యేక పూజలు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 30 ఏళ్ల తర్వాత చారిత్రక ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ముర్రాన్ గ్రామంలో తెరిచిన ఈ బరారీ మౌజ్ ఆలయంలో కాశ్మీరీ పండిట్లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముర్రాన్ గ్రామానికి చెందిన పండితులు, ముస్లిం ప్రజలు కలిసి ఆలయ తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు ప్రసాదం పంపిణీ చేశారు. అలాగే ఇరు వర్గాల ప్రజలు కలిసి హోమం చేశాయి. మూడు దశాబ్దాల తర్వాత బరారీ మౌజ్ ఆలయాన్ని తెరవడం పట్ల గ్రామంలోని వలసేతర పండితులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ సమయంలో కాశ్మీరీ పండిట్ మాట్లాడుతూ.. “మేం ఎప్పటికీ ఇక్కడి నుంచి వెళ్లిపోనట్లు భావిస్తున్నాం. మమ్మల్ని ఎప్పుడూ చూడని ముస్లిం యువకులు మమ్మల్ని వారి తల్లిదండ్రుల స్నేహితులుగా చూస్తున్నారు. వారితల్లిదండ్రుల కంటే మమ్మల్ని ఎక్కువగా గౌరవించారు. బరారీ మౌజ్
ఆలయంలో భజనలు పాడే బృందం ముస్లిం సమాజానికి చెందినది. వారు కాశ్మీరీ పండిట్ల కోసం భజనలు చేస్తున్నారు.”
READ MORE: Central Cabinet: కేంద్ర మంత్రుల్లో ఎంత మంది పట్టభద్రులు ఉన్నారో తెలుసా?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
భవిష్యత్తులో కూడా ఇలాంటి హోమాలు కొనసాగిస్తామని స్థానికులు తెలిపారు. కాగా.. పుల్వామా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వార్తలు వస్తుంటాయని విషయం మీకు తెలిసిందే. ఇది తీవ్రవాదుల కోటగా పరిగణించబడుతుంది. తాజాగా పుల్వామాలో రెండు పేలుడు పదార్థాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీరితో పాటు లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులను కూడా అరెస్టు చేశారు. ఆదివారం ఇక్కడ నుంచి సుమారు ఆరు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, దానిని ధ్వంసం చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఇక్కడ హిందూ- ముస్లింలు కలిసి ఉండటం పూజలు చేయడం స్ఫూర్తిదాయకంగా పరిగణించవచ్చు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!