Jammu Kashmir: పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న ఆలయ తలుపులు
- ముర్రాన్ గ్రామంలో తెరుచుకున్నఈ బరారీ మౌజ్ ఆలయం తలుపులు
- హోమం నిర్వహించిన ముస్లిం-హిందువులు
- కాశ్మీరీ పండిట్ల ప్రత్యేక పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 30 ఏళ్ల తర్వాత చారిత్రక ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ముర్రాన్ గ్రామంలో తెరిచిన ఈ బరారీ మౌజ్ ఆలయంలో కాశ్మీరీ పండిట్లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముర్రాన్ గ్రామానికి చెందిన పండితులు, ముస్లిం ప్రజలు కలిసి ఆలయ తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు ప్రసాదం పంపిణీ చేశారు. అలాగే ఇరు వర్గాల ప్రజలు కలిసి హోమం చేశాయి. మూడు దశాబ్దాల తర్వాత బరారీ మౌజ్ ఆలయాన్ని తెరవడం పట్ల గ్రామంలోని వలసేతర పండితులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ సమయంలో కాశ్మీరీ పండిట్ మాట్లాడుతూ.. “మేం ఎప్పటికీ ఇక్కడి నుంచి వెళ్లిపోనట్లు భావిస్తున్నాం. మమ్మల్ని ఎప్పుడూ చూడని ముస్లిం యువకులు మమ్మల్ని వారి తల్లిదండ్రుల స్నేహితులుగా చూస్తున్నారు. వారితల్లిదండ్రుల కంటే మమ్మల్ని ఎక్కువగా గౌరవించారు. బరారీ మౌజ్
ఆలయంలో భజనలు పాడే బృందం ముస్లిం సమాజానికి చెందినది. వారు కాశ్మీరీ పండిట్ల కోసం భజనలు చేస్తున్నారు.”
READ MORE: Central Cabinet: కేంద్ర మంత్రుల్లో ఎంత మంది పట్టభద్రులు ఉన్నారో తెలుసా?
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
భవిష్యత్తులో కూడా ఇలాంటి హోమాలు కొనసాగిస్తామని స్థానికులు తెలిపారు. కాగా.. పుల్వామా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వార్తలు వస్తుంటాయని విషయం మీకు తెలిసిందే. ఇది తీవ్రవాదుల కోటగా పరిగణించబడుతుంది. తాజాగా పుల్వామాలో రెండు పేలుడు పదార్థాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీరితో పాటు లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులను కూడా అరెస్టు చేశారు. ఆదివారం ఇక్కడ నుంచి సుమారు ఆరు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, దానిని ధ్వంసం చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఇక్కడ హిందూ- ముస్లింలు కలిసి ఉండటం పూజలు చేయడం స్ఫూర్తిదాయకంగా పరిగణించవచ్చు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!