Pakistan: పాకిస్తాన్కి మోడీ లాంటి నాయకుడు కావాలి.. పాక్ వ్యాపారవేత్త ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్కి ప్రధాని నరేంద్రమోడీ లాంటి నాయకుడు కావాలని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ వ్యాఖ్యానించారు. మోడీ మూడోసారి కూడా గెలుస్తారని జోస్యం చెప్పారు. పాకిస్తాన్-భారత్తో చర్చలు ప్రారంభించి వాణిజ్యం ప్రారంభించాలని సూచించారు. భారతదేశాన్ని ప్రధాని మోడీ కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడని, ఆయన బలమైన నేత అని తరార్ కొనియాడారు. సాజిద్ తరార్ మాట్లాడుతూ.. మోడీ భారతదేశానికి మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి, ప్రపంచానికి చాలా మంచివాడు. పాకిస్తాన్కి కూడా అతనిలాంటి నాయకుడు వస్తాడని ఆశిస్తున్నానని అన్నారు. భారత్ యువజనాభా నుంచి లాభం పొందుతుందని చెప్పారు.
Read Also: Jharkhand: రూ. 37 కోట్లు పట్టుబడిన కేసులో మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం అరెస్ట్..
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
‘‘ మోడీ గొప్పనాయకుడు. ఆయన సహజ నాయకుడు, ప్రతికూల పరిస్థితుల్లో పాకిస్తాన్లో పర్యటించి, తన రాజకీయాలను పణంగా పెట్టిన ఏకైక ప్రధాని ఆయనే. మోడీజీ పాకిస్తాన్తో చర్చలు, వాణిజ్యం ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను’’ అని తరార్ చెప్పారు. శాంతియుత పాకిస్తాన్ భారత్కి కూడా మంచిదని, భారతదేశ తదుపరి ప్రధాని మోడీనే అని అన్నారు. తరార్ 1990లో యూఎస్ వెళ్లి వ్యాపారంలో స్థిరపడ్డారు.
‘‘భారత్లో 97 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం ఒక అద్భుతం తప్ప మరోటి కాదు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. నేను అక్కడ మోడీజీకి ఉన్న ప్రజాదరణ చూస్తున్నా. 2024లో భారత్ ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. భారత ప్రజాస్వామ్యం నుంచి భవిష్యత్తులో ప్రజలు నేర్చుకుంటారు’’ అని తరార్ అన్నారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, దీని ఫలితంగా పీఓకే తో సహా దేశంలోని అనేక ప్రాంతాలు సామాజిక అశాంతిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది, ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉందని, పెట్రోల్ ధరలు పెరిగాయి, పన్నులు పెంచాలని ఐఎంఎఫ్ కోరుతోంది, కరెంట్ ఖర్చులు పెరిగాయి, మేము ఎగుమతి చేయలేకపోతున్నామని తరార్ అన్నారు. విద్యుత్ బిల్లుల కారణంగా పాక్ ఆక్రమిత్ కాశ్మీర్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!