Pakistan: పాకిస్తాన్కి మోడీ లాంటి నాయకుడు కావాలి.. పాక్ వ్యాపారవేత్త ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్కి ప్రధాని నరేంద్రమోడీ లాంటి నాయకుడు కావాలని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ వ్యాఖ్యానించారు. మోడీ మూడోసారి కూడా గెలుస్తారని జోస్యం చెప్పారు. పాకిస్తాన్-భారత్తో చర్చలు ప్రారంభించి వాణిజ్యం ప్రారంభించాలని సూచించారు. భారతదేశాన్ని ప్రధాని మోడీ కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడని, ఆయన బలమైన నేత అని తరార్ కొనియాడారు. సాజిద్ తరార్ మాట్లాడుతూ.. మోడీ భారతదేశానికి మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి, ప్రపంచానికి చాలా మంచివాడు. పాకిస్తాన్కి కూడా అతనిలాంటి నాయకుడు వస్తాడని ఆశిస్తున్నానని అన్నారు. భారత్ యువజనాభా నుంచి లాభం పొందుతుందని చెప్పారు.
Read Also: Jharkhand: రూ. 37 కోట్లు పట్టుబడిన కేసులో మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం అరెస్ట్..
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
‘‘ మోడీ గొప్పనాయకుడు. ఆయన సహజ నాయకుడు, ప్రతికూల పరిస్థితుల్లో పాకిస్తాన్లో పర్యటించి, తన రాజకీయాలను పణంగా పెట్టిన ఏకైక ప్రధాని ఆయనే. మోడీజీ పాకిస్తాన్తో చర్చలు, వాణిజ్యం ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను’’ అని తరార్ చెప్పారు. శాంతియుత పాకిస్తాన్ భారత్కి కూడా మంచిదని, భారతదేశ తదుపరి ప్రధాని మోడీనే అని అన్నారు. తరార్ 1990లో యూఎస్ వెళ్లి వ్యాపారంలో స్థిరపడ్డారు.
‘‘భారత్లో 97 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం ఒక అద్భుతం తప్ప మరోటి కాదు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. నేను అక్కడ మోడీజీకి ఉన్న ప్రజాదరణ చూస్తున్నా. 2024లో భారత్ ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. భారత ప్రజాస్వామ్యం నుంచి భవిష్యత్తులో ప్రజలు నేర్చుకుంటారు’’ అని తరార్ అన్నారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, దీని ఫలితంగా పీఓకే తో సహా దేశంలోని అనేక ప్రాంతాలు సామాజిక అశాంతిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది, ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉందని, పెట్రోల్ ధరలు పెరిగాయి, పన్నులు పెంచాలని ఐఎంఎఫ్ కోరుతోంది, కరెంట్ ఖర్చులు పెరిగాయి, మేము ఎగుమతి చేయలేకపోతున్నామని తరార్ అన్నారు. విద్యుత్ బిల్లుల కారణంగా పాక్ ఆక్రమిత్ కాశ్మీర్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!