Opposition Meeting: బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం.. హాజరుకానున్న ముఖ్య పార్టీ నేతలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే.. ఒక్కొక్కటిగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కగూటికి చేరుతున్నాయి. బీజేపీని దెబ్బకొట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన ఓసారి ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి 15 మంది ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. మరోసారి సమావేశమయ్యేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యారు. రేపటి నుంచి (జులై 17) రెండురోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరగనుంది.
Rashmika mandanna : బేబీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..
Also Read
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
ఈ సమావేశంలో దాదాపు 24 ప్రతిపక్ష పార్టీలు పాల్గొననున్నాయి. మొదటి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇప్పుడు బెంగళూరులో జరగనున్న సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తోంది. బెంగళూరులో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా.. కాలికి గాయం కావడంతో ఆమె సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సమావేశానికి తమ తరపు నుంచి ఓ ప్రతినిధి హాజరుకానున్నారు.
Kethika Sharma :పొట్టి డ్రెస్ లో థైస్ షోతో మతులు చెడగొడుతున్న కేతికా శర్మ..
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపింది. ఆదివారం జరిగిన పార్టీ పీఏసీ సమావేశం అనంతరం ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తమ పార్టీ హాజరవుతుందని చెప్పారు. కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం), సమాజ్ వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం), తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, జేడీ(యూ), షనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ (ఎంఎల్), జేఎంఎం, ఆర్ఎల్డీ, ఆర్ఎస్పీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (ఎం), వీసీకే, ఎండీఎంకే, కేడీఎంకే, కేరళ కాంగ్రెస్ (జే), ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు హాజరుకానున్నాయి.
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
OTR: పశ్చిమ గోదావరి వైసపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..