Opposition Meeting: బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం.. హాజరుకానున్న ముఖ్య పార్టీ నేతలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే.. ఒక్కొక్కటిగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కగూటికి చేరుతున్నాయి. బీజేపీని దెబ్బకొట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన ఓసారి ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి 15 మంది ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. మరోసారి సమావేశమయ్యేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యారు. రేపటి నుంచి (జులై 17) రెండురోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరగనుంది.
Rashmika mandanna : బేబీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..
Also Read
- CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ఈ సమావేశంలో దాదాపు 24 ప్రతిపక్ష పార్టీలు పాల్గొననున్నాయి. మొదటి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇప్పుడు బెంగళూరులో జరగనున్న సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తోంది. బెంగళూరులో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా.. కాలికి గాయం కావడంతో ఆమె సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సమావేశానికి తమ తరపు నుంచి ఓ ప్రతినిధి హాజరుకానున్నారు.
Kethika Sharma :పొట్టి డ్రెస్ లో థైస్ షోతో మతులు చెడగొడుతున్న కేతికా శర్మ..
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపింది. ఆదివారం జరిగిన పార్టీ పీఏసీ సమావేశం అనంతరం ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తమ పార్టీ హాజరవుతుందని చెప్పారు. కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం), సమాజ్ వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం), తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, జేడీ(యూ), షనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ (ఎంఎల్), జేఎంఎం, ఆర్ఎల్డీ, ఆర్ఎస్పీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (ఎం), వీసీకే, ఎండీఎంకే, కేడీఎంకే, కేరళ కాంగ్రెస్ (జే), ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు హాజరుకానున్నాయి.
తాజావార్తలు
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..