Operation Sindoor: పాకిస్తాన్కి అండగా నిలిచిన చైనా, టర్కీ.. సంచలన విషయాలు వెలుగులోకి..
- పాకిస్తాన్ని అడ్డుపెట్టుకుని చైనా ప్రాక్సీ వార్..
- భారత్పై దాడిలో పాక్కి అండగా చైనా, టర్కీ..
- వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు ప్రతీ విషయంలోనూ పాకిస్తాన్కి చైనా సపోర్టు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. చైనా మద్దతుతో పాటు టర్కీ కూడా భారత్పై దాడిలో పరోక్షంగా, ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. గత వారం జరిగిన భారత్-పాకిస్తాన్ మధ్య వైమానిక పోరాటంలో చైనా పాత్ర స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలోకి భారత్ ఫైటర్ జెట్లు వెళ్లిన సమయంలో, పాకిస్తాన్ చైనీస్ PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను ప్రయోగించింది.
అయితే, ఇవి సాధారణ ప్రయోగాలు కావని తేలింది. భారత రాడార్లలో వీటి ప్రయోగం ప్రమాదకరంగా ఆలస్యంగా కనిపించాయని తెలుస్తోంది. దీనికి ఫ్యూజన్ ఆపరేషన్ అని పిలువబడే ఒక కొత్త యుద్ధ వ్యూహంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఈ క్షిపణుల నిర్వహణకు ‘‘థర్డ్ పార్టీ’’ ఆపరేటర్లను, బహూశా చైనా నిపుణులు పనిచేసినట్లు తెలుస్తోంది. వీరు రిమోట్గా శాటిలైట్స్ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ & కమాండ్ సిస్టమ్స్ (AEW&CS) ఉపయోగించి క్షిపణులకు ప్రయోగించినట్లు తెలుస్తోంది. వీటి వెనక డ్రాగన్ కంట్రీ వ్యూహాలు ఉన్నాయనేదానిపై క్లారిటీ వచ్చింది. అయితే, భారత వైమానిక రక్షణ వ్యవస్థ చాలా క్షిపణులను అడ్డుకుని, పేల్చేసింది.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
Read Also: S Jaishankar: కాల్పుల విరమణ, ట్రంప్ కామెంట్స్పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
పహల్గామ్ దాడిలో కూడా చైనా పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులు బీడౌ-ఎనేబుల్డ్ నావిగేషన్ పరికరాలను వాడినట్లు దర్యాప్తు చేస్తున్న భారత దళాలు గుర్తించాయి. ఇది చైనా జీపీఎస్. భారత నెట్వర్క్లపై ఆధారపడకుండా వీరు చైనీస్ జీపీఎస్ అయిన బీడౌని వాడారు. ఇవి చొరబాటుదారులు సంప్రదాయక టెలికాం గ్రిడ్లపై ఆధాపడకుండా చేస్తుంది. దీని ద్వారా వారిని కనిపెట్టడం కష్టమవుతుంది.
దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో హువావే మేట్ 60 ప్ర స్మార్ట్ఫోన్ లభించింది. ఇది కేవలం ఫోన్ మాత్రమే కాదు, నేరుగా చైనా టియాంటాంగ్-1 శాటిలైట్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. బ్లాక్ అవుట్ సమయంలో కూడా కాల్స్ చేయడానికి, మెసేజ్ పంపించడానికి వీలు కల్పిస్తుంది. మరోవైపు, టర్కిష్ డ్రోన్లను కూడా పాక్ భారత్పై ప్రయోగించింది. అయితే, భారత్ వీటిని ఆకాశంలోనే దెబ్బకొట్టాయి. వీటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీ మిలిటరీ పర్సన్స్ కూడా సాయం చేసినట్లు తెలుస్తోంది. భారత్ దాడిలో వీరిద్దరు మరణించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!