Operation Sindoor: పాకిస్తాన్కి అండగా నిలిచిన చైనా, టర్కీ.. సంచలన విషయాలు వెలుగులోకి..
- పాకిస్తాన్ని అడ్డుపెట్టుకుని చైనా ప్రాక్సీ వార్..
- భారత్పై దాడిలో పాక్కి అండగా చైనా, టర్కీ..
- వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు ప్రతీ విషయంలోనూ పాకిస్తాన్కి చైనా సపోర్టు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. చైనా మద్దతుతో పాటు టర్కీ కూడా భారత్పై దాడిలో పరోక్షంగా, ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. గత వారం జరిగిన భారత్-పాకిస్తాన్ మధ్య వైమానిక పోరాటంలో చైనా పాత్ర స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలోకి భారత్ ఫైటర్ జెట్లు వెళ్లిన సమయంలో, పాకిస్తాన్ చైనీస్ PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను ప్రయోగించింది.
అయితే, ఇవి సాధారణ ప్రయోగాలు కావని తేలింది. భారత రాడార్లలో వీటి ప్రయోగం ప్రమాదకరంగా ఆలస్యంగా కనిపించాయని తెలుస్తోంది. దీనికి ఫ్యూజన్ ఆపరేషన్ అని పిలువబడే ఒక కొత్త యుద్ధ వ్యూహంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఈ క్షిపణుల నిర్వహణకు ‘‘థర్డ్ పార్టీ’’ ఆపరేటర్లను, బహూశా చైనా నిపుణులు పనిచేసినట్లు తెలుస్తోంది. వీరు రిమోట్గా శాటిలైట్స్ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ & కమాండ్ సిస్టమ్స్ (AEW&CS) ఉపయోగించి క్షిపణులకు ప్రయోగించినట్లు తెలుస్తోంది. వీటి వెనక డ్రాగన్ కంట్రీ వ్యూహాలు ఉన్నాయనేదానిపై క్లారిటీ వచ్చింది. అయితే, భారత వైమానిక రక్షణ వ్యవస్థ చాలా క్షిపణులను అడ్డుకుని, పేల్చేసింది.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: S Jaishankar: కాల్పుల విరమణ, ట్రంప్ కామెంట్స్పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
పహల్గామ్ దాడిలో కూడా చైనా పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులు బీడౌ-ఎనేబుల్డ్ నావిగేషన్ పరికరాలను వాడినట్లు దర్యాప్తు చేస్తున్న భారత దళాలు గుర్తించాయి. ఇది చైనా జీపీఎస్. భారత నెట్వర్క్లపై ఆధారపడకుండా వీరు చైనీస్ జీపీఎస్ అయిన బీడౌని వాడారు. ఇవి చొరబాటుదారులు సంప్రదాయక టెలికాం గ్రిడ్లపై ఆధాపడకుండా చేస్తుంది. దీని ద్వారా వారిని కనిపెట్టడం కష్టమవుతుంది.
దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో హువావే మేట్ 60 ప్ర స్మార్ట్ఫోన్ లభించింది. ఇది కేవలం ఫోన్ మాత్రమే కాదు, నేరుగా చైనా టియాంటాంగ్-1 శాటిలైట్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. బ్లాక్ అవుట్ సమయంలో కూడా కాల్స్ చేయడానికి, మెసేజ్ పంపించడానికి వీలు కల్పిస్తుంది. మరోవైపు, టర్కిష్ డ్రోన్లను కూడా పాక్ భారత్పై ప్రయోగించింది. అయితే, భారత్ వీటిని ఆకాశంలోనే దెబ్బకొట్టాయి. వీటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీ మిలిటరీ పర్సన్స్ కూడా సాయం చేసినట్లు తెలుస్తోంది. భారత్ దాడిలో వీరిద్దరు మరణించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!