Manipur: మణిపూర్లో శివాలయంపై దుండగుల దాడి..
- మణిపూర్లో శివాలయంపై దుండగుల దాడి..
- సేనాపతి జిల్లాలో ఘటన..
- మత విద్వేషాల కోసమే దాడి చేసినట్లు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: గతేడాది కాలంలో మణిపూర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణ ఆ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. ఈ రెండు తెగల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణలు మతం రంగును పులుముకుంటున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలో కొందరు వ్యక్తులు రాత్రిపూట శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోకి చొరబడి శివాలయానికి నిప్పటించారు. దీంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది. రెండు వారాల వ్యవధిలో ఆలయంపై రెండోదాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆలయం మంటలు వ్యాపించడం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
Read Also: JK Polls: జమ్మూకాశ్మీర్లో ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పోలింగ్
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
మంటలు వ్యాపించకుండా స్థానికులు చర్యలు తీసుకున్నారు. నాగా పీపుల్స్ ఆర్గనైజేషన్ (NPO), కరోంగ్-సేనాపతి టౌన్ కమిటీ (KSTC) దుండగుల చర్యల్ని ఖండించారు. శ్రీ శ్రీ పశుపతి నాథ్ మందిరాన్ని తగలబెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. సేనాపతి శాంతియుతంగా ఉండే పట్టణమని, ఇక్కడ ప్రతీ ఒక్కరూ తమ మతాన్ని ఆచరిస్తారని, సామాజిక ప్రశాంతతని విచ్ఛిన్నం చేసే ఏ చర్యనైనా ఖండిస్తామని రెండు సంస్థలు ప్రకటించాయి. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసుల్ని కోరారు.
మెయిటీ, కుకీ తెగల హింసాత్మక ఘటనల మధ్య మతపరమైన, జాతి ఉద్రిక్తల్ని సృష్టించేందుకు దుండగులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆలయంపై దాడిని మణిపూర్ రాజ్యసభ ఎంపీ మహారాజా సనజయోబా లీషెంబా ఎక్స్లో ఖండించారు. లౌకికవాదానికి విఘాతం కలిగించే ఏ చర్యనైనా ఖండించాల్సిందే అని, దోషులపై కేసులు నమోదు చేయాలని ట్వీట్ చేశారు. రాష్ట్రవాప్యంగా కుకీ మెయిటీ సమస్య ఉన్నప్పటి సేనాపతి మాత్రం ప్రశాంతంగా ఉండని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. గతేడాది నుంచి జరిగిన ఘర్షణల్లో 200 మంది మరణించారు. దాదాపు 50,000 మంది ఇళ్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లారు.
Strongly condemn Looting & setting of Shri Pashupati Nath Mandir, Senapati, Manipur on fire at around 1 am of 25/9/24.
Every responsible citizen should condemn such barbaric act bcoz it's an infringement of Secularism. The culprit (s) should be booked at the earliest. @AmitShah pic.twitter.com/U2L0M4Q240— Maharaja Sanajaoba Leishemba. (@MaharajaManipur) September 25, 2024
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!