Manipur: మణిపూర్లో శివాలయంపై దుండగుల దాడి..
- మణిపూర్లో శివాలయంపై దుండగుల దాడి..
- సేనాపతి జిల్లాలో ఘటన..
- మత విద్వేషాల కోసమే దాడి చేసినట్లు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: గతేడాది కాలంలో మణిపూర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణ ఆ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. ఈ రెండు తెగల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణలు మతం రంగును పులుముకుంటున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలో కొందరు వ్యక్తులు రాత్రిపూట శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోకి చొరబడి శివాలయానికి నిప్పటించారు. దీంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది. రెండు వారాల వ్యవధిలో ఆలయంపై రెండోదాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆలయం మంటలు వ్యాపించడం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
Read Also: JK Polls: జమ్మూకాశ్మీర్లో ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పోలింగ్
Also Read
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
మంటలు వ్యాపించకుండా స్థానికులు చర్యలు తీసుకున్నారు. నాగా పీపుల్స్ ఆర్గనైజేషన్ (NPO), కరోంగ్-సేనాపతి టౌన్ కమిటీ (KSTC) దుండగుల చర్యల్ని ఖండించారు. శ్రీ శ్రీ పశుపతి నాథ్ మందిరాన్ని తగలబెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. సేనాపతి శాంతియుతంగా ఉండే పట్టణమని, ఇక్కడ ప్రతీ ఒక్కరూ తమ మతాన్ని ఆచరిస్తారని, సామాజిక ప్రశాంతతని విచ్ఛిన్నం చేసే ఏ చర్యనైనా ఖండిస్తామని రెండు సంస్థలు ప్రకటించాయి. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసుల్ని కోరారు.
మెయిటీ, కుకీ తెగల హింసాత్మక ఘటనల మధ్య మతపరమైన, జాతి ఉద్రిక్తల్ని సృష్టించేందుకు దుండగులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆలయంపై దాడిని మణిపూర్ రాజ్యసభ ఎంపీ మహారాజా సనజయోబా లీషెంబా ఎక్స్లో ఖండించారు. లౌకికవాదానికి విఘాతం కలిగించే ఏ చర్యనైనా ఖండించాల్సిందే అని, దోషులపై కేసులు నమోదు చేయాలని ట్వీట్ చేశారు. రాష్ట్రవాప్యంగా కుకీ మెయిటీ సమస్య ఉన్నప్పటి సేనాపతి మాత్రం ప్రశాంతంగా ఉండని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. గతేడాది నుంచి జరిగిన ఘర్షణల్లో 200 మంది మరణించారు. దాదాపు 50,000 మంది ఇళ్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లారు.
Strongly condemn Looting & setting of Shri Pashupati Nath Mandir, Senapati, Manipur on fire at around 1 am of 25/9/24.
Every responsible citizen should condemn such barbaric act bcoz it's an infringement of Secularism. The culprit (s) should be booked at the earliest. @AmitShah pic.twitter.com/U2L0M4Q240— Maharaja Sanajaoba Leishemba. (@MaharajaManipur) September 25, 2024
తాజావార్తలు
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!