Afzal Guru: “అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల లాభం లేదు”.. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- అఫ్జల్ గురిని ఉరితీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు..
- జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అనుమతి కోరితే ఇచ్చే వాళ్లం కాదు..
- 2001 పార్లమెంట్ దాడి నిందితుడికి ఒమర్ అబ్దుల్లా మద్దతు..
- ఉగ్రవాదుల నుంచి సాయం పొందాలనుకుంటున్నాని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afzal Guru: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. 2001లో పార్లమెంట్పై దాడి చేసిన కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల ఏం ప్రయోజనం లేదని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది.
‘‘ఒమర్ అబ్దుల్లా ఏం చెప్పాలనుకుంటున్నారు..? భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నిన దేశ వ్యతిరేక శక్తులకు మరణశిక్ష విధిస్తే, వారు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..? వారు ఉగ్రవాదుల నుంచి మద్దతు తీసుకునే పరిస్థితిని సృష్టించాలనుకుంటున్నారు. అందుకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా అన్నారు.
Also Read
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
Read Also: Sangareddy: భారీ వర్షాలతో సంగారెడ్డి అతలాకుతలం.. చెరువులను తలపిస్తున్న కాలనీలు
అంతకుముందు, అఫ్జల్ గురు ఉరిశిక్షకు సంబంధించి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఈ ప్రక్రియలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని ఆయన చెప్పారు. ఒక వేళ రాష్ట్ర ఆమోదం కావాలని కోరితే, మేము దానిని మంజూరు చేసే వాళ్లం దాని చెప్పారు. అతడిని ఉరితీయడం ద్వారా ఏదైనా ప్రయోజనం నెరవేరిందని నేను నమ్మడం లేదు అని అబ్దుల్లా శుక్రవారం అన్నారు.
జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 18,25, అక్టోబర్ 01న మూడు విడతల్లో జమ్మూ కాశ్మీర్లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 08న ఫలితాలు వెలువడుతాయి. భారత ఎన్నికల సంఘం ప్రకారం.. జమ్మూ కాశ్మీర్లో 88.06 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!