Triple Talaq: సైబర్ ఫ్రాడ్లో మోసపోయిన భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Triple Talaq: సైబర్ మోసాల పట్ల ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసిన ఎక్కడో చోట ప్రజలు అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. విదేశాల నుంచి గిఫ్టులు పంపిస్తామని, లాటరీ తగిలిందని చెబుతూ జనాలను మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సైబర్ మోసం 15 ఏళ్ల వివాహబంధానికి తెరపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే ఒడిశాకు చెందిన ఓ మహిళ రూ. 1.5 లక్షలను సైబర్ మోసంలో పోగొట్టుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
Read Also: Israel: ఇజ్రాయిల్ పై సిరియా దాడి.. సరిహద్దు దేశాల నుంచి వరస దాడులు..
Also Read
కేంద్రపర జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ జమ్రున్ బీబీకి ఫేస్ బుక్ ద్వారా రవి వర్మ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం స్నేహంగా మారింది. అక్క అని పిలుస్తూ తనది జార్ఖండ్ అని, ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉంటున్నానని నమ్మించారు. ఈ మాటలను జమ్రున్ బీబీ నమ్మింది. ఈ నేపథ్యంలో ఆమెకు రూ. 25 లక్షల విలువైన బంగార కంఠహారం, ఫ్రిడ్జ్, ఐఫోన్, ఏసీ వంటి ఖరీదైన వస్తువులను పంపుతాని అని నమ్మబలికాడు. వాటిని పంపేందుకు దాదాపుగా రూ.1.70 లక్షలు కొరియర్ ఛార్జీలు అవుతాయని నమ్మించాడు. ఈ మాటలను నమ్మిన మహిళ తన నెక్లెస్ తాకట్టు పెట్టి రూ. 60 వేలు పంపింది. మరో విడతగా రూ. 1,70,000లను రవి వర్మకు అందించింది. అయితే ఈ డబ్బు అందిన తర్వాత మాట్లాడటం మానేశాడు రవివర్మ.
తాను మోసపోయాని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ లో ఉన్న భర్త రజీద్.. ఫోన్లోనే జమ్రున్ కు ట్రిపుల్ తలాక్ చెప్పారు. దీంతో వీరిద్దరి 15 ఏళ్ల వివాహ బంధానికి తెరపడింది. జమ్రున్ కు ఇద్దరు టీనేజ్ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారు. ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు 45 ఏళ్ల రజీద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 2017లో కేంద్ర ప్రభుత్వం భారత దేశంలో ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసింది.
తాజావార్తలు
-
Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?