Bihar: నితీష్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్
- బీహార్లో నితీష్ సర్కార్ సంచలన నిర్ణయం
- ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్
- రూల్స్ మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వాడకంపై కఠిన ఆంక్షలు విధించింది. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో అనుచిత వ్యాఖ్యలు లేదా దురుసుగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: Trump Video: ఆమె అందం చూసే అతడికి పదవి ఇచ్చా.. ట్రంప్ హాట్ కామెంట్స్
Also Read
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఇకపై అనుమతి లేకుండా ఖాతాలను సృష్టించడం, రీల్స్ చేయడం, ప్రత్యక్ష ప్రసారం చేయడం, ఏదైనా పాలసీపై వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరచడంపై పూర్తిగా నిషేధం విధించింది. ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సోషల్ మీడియా ఖాతాను సృష్టించే ముందు సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందడం తప్పనిసరి చేసింది. అనామక లేదా నకిలీ ఖాతాలను ఉపయోగించడంపై కూడా పూర్తిగా నిషేధం విధించింది. ఒకవేళ ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: UP: యానిమల్ పేరుతో భర్త సరదాగా పరిహాసం.. భార్య ఏం చేసిందంటే..!
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య సోషల్ మీడియా కేసులు ఎక్కువ కావడంతో మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో అనుచిత వ్యాఖ్యలు చేసే లేదా దురుసుగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడటానికి ఈ నియమం అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేబినెట్ మార్గదర్శకాల ప్రకారం.. బీహార్లోని ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సోషల్ మీడియా ఖాతాను సృష్టించే ముందు వారి సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. విధుల్లో ఉన్నప్పుడు కంటెంట్ను సృష్టించడం కచ్చితంగా నిషేధించబడింది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు పనికి లేదా కార్యాలయానికి సంబంధించిన కంటెంట్ను సృష్టించడం కూడా కచ్చితంగా నిషేధించారు. ‘‘ఏదైనా రకమైన రీల్, వీడియో, ఫొటో లేదా ప్రత్యక్ష సంభాషణను ప్రసారం చేయడం నిబంధనలను నేరుగా ఉల్లంఘించినట్లుగా పరిగణించబడుతుంది. ఇటువంటి వీడియోలు తరచుగా ప్రతికూల సందేశాన్ని పంపుతాయని.. కార్యాలయ గోప్యతను ఉల్లంఘిస్తాయి..’’ అని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వ విధానాలు, పథకాలు లేదా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు నిర్ణయాలపై ఏ ఉద్యోగి కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్యను క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తారు. దీనిని సర్వీస్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. కఠినమైన శిక్ష విధించబడుతుంది.
తాజావార్తలు
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
-
Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!