Nirmala Sitharaman: దేశంలో పెట్రోల్ ధరలు అందుకే పెరుగుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం పడుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను కేంద్రం పెంచుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు, ఎన్నికలకు సంబంధం లేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రభావంతో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. దేశంలో ఇంధన ధరల పెరుగుదలను పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అయితే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తిప్పికొడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచే రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయని.. అప్పుడు పెరగని చమురు ధరలు ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో గమ్మున ఉండి.. ఇప్పుడు పెట్రో బాదుడుకు పూనుకోవడం మోదీ ప్రభుత్వ మోసకారితనానికి నిదర్శనమని మండిపడుతున్నారు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..