Farmers Suicide: కర్ణాటకలో 15 నెలల్లో వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య.. కారణమిదే
- కర్ణాటకలో 15 నెలల్లో వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య
- రైతు ఆత్మహత్యలకు కారణం కరువు.. పంట నష్టం.. రుణభారం
- అత్యధికంగా బెలగావిలో 122.. హవేరిలో 120 రైతు ఆత్మహత్యలు నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. గత 15 నెలల వ్యవధిలో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు తీవ్రమైన కరువు, పంట నష్టం మరియు విపరీతమైన అప్పులు అని రెవెన్యూ శాఖ పేర్కొంది. కర్ణాటకలో అత్యధికంగా బెలగావి, హవేరి మరియు ధార్వాడ్లోని మూడు జిల్లాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బెలగావిలో 122, హవేరిలో 120, ధార్వాడ్ లో 101 మంది సూసైడ్ చేసుకున్నారు.
Read Also: PM Modi: రష్యా చేరుకున్న ప్రధాని మోడీ.. ఘనస్వాగతం
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
మరోవైపు.. చిక్కమగళూరులో 89 మంది, కలబుర్గిలో 69 మంది, యాదగిరిలో 68 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కర్నాటకలోని 27 జిల్లాల్లో 6 జిల్లాల్లో రైతులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారు సింగిల్ డిజిట్ లో నమోదు కాగా.. మిగిలిన 21 జిల్లాల్లో 30 లేదా అంతకంటే ఎక్కువ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చిక్కబళ్లాపూర్, చామరాజ్నగర్లో రెండేసి రైతు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి.
Read Also: Manchu Family: మళ్ళీ బయటపడ్డ విభేదాలు.. పేరు ప్రస్తావించుకోడానికి కూడా ఇష్టపడని మంచు బ్రదర్స్
గత సెప్టెంబరు నెలలో కర్నాటకలోని చెరకు అభివృద్ధి మరియు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల (APMC) మంత్రి శివానంద్ పాటిల్, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పడం వివాదానికి దారితీసింది. పంట నష్టాలు, రుణాలు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు ఈ పరిహారం చెల్లించాలని కోరుతున్నాయన్నారు. ఇదిలా ఉంటే.. పాటిల్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘సొంత కారణాలతో’ ఆత్మహత్య చేసుకున్న వారిని రైతులు అని పిలవలేమని అన్నారు.
తాజావార్తలు
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!