Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ ట్రైన్.. కొత్తగా ఈ రూట్లలో సూపర్ ఫాస్ట్ ట్రైన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: దేశంలో మొత్తంగా ఇప్పటి వరకు 11 వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు భారత ప్రధాని నరేంద్రమోదీ భోపాల్-న్యూఢిల్లీల మధ్య 11వ వందేభారత్ ట్రైన్ ప్రారంభించారు. సెమీ హైస్పీడ్ రైళ్లను ఇండియా వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీని కలుపుతూ.. వివిధ నగరాల నుంచి నాలుగు రైళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం భోపాల్-ఢిల్లీల మధ్య 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల వ్యవధిలోనే రైలు చేరుకోనుంది.
ఇప్పటి వరకు ప్రారంభం అయిన వందే భారత్ రైళ్లు..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
1. ముంబై సెంట్రల్- అహ్మదాబాద్- గాంధీనగర్,
2. ముంబై- సాయినగర్ షిర్డీ,
3. ముంబై-షోలాపూర్,
4. న్యూఢిల్లీ-వారణాసి,
5. న్యూఢిల్లీ-శ్రీ వైష్ణో దేవీ మాత కట్రా,
6. అంబ్ అందౌౌరీ- న్యూ ఢిల్లీ,
7. మైసూరు – పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్
8. నాగ్ పూర్-బిలాస్ పూర్
9. హౌరా-న్యూ జల్పాయ్ గురి
10. సికింద్రాబాద్-విశాఖపట్నం
11. భోపాల్-న్యూ ఢిల్లీ
కొత్తగా ప్రారంభం కాబోయే వందేభారత్ ట్రైన్స్ ఇవే..
చెన్నై-కోయంబత్తూర్ భారత్ ఎక్స్ప్రెస్
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 8, 2023న చెన్నై స్టేషన్ నుంచి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. ఇది 12వ వందేభారత్ ట్రైన్. చెన్నై నుంచి మైసూరుకు ఇప్పటికే ఓ వందే భారత్ ట్రైన్ నడుస్తోంది.
ఢిల్లీ – జైపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్
ఏప్రిల్ 10లోపు ఢిల్లీ-జైపూర్ నగరాల మధ్య వందేభారత్ రైల్ ప్రారంభం అవుతుందని ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో కొత్తగా ఒక వందేభారత్ రైలును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇది రెండో వందేభారత్ రైలు అవుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖల మధ్య ఓ రైలు నడుస్తోంది.
పాట్నా-రాంచీ వందే భారత్ ఎక్స్ప్రెస్
రాంచీ (జార్ఖండ్) నుండి పాట్నా (బీహార్) మార్గంలో 15వ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించే అవకాశం ఉంది. సెమీ-హై స్పీడ్ రైలు ప్రయాణాన్ని 6 గంటల్లో కవర్ చేస్తుంది మరియు ఏప్రిల్ 25న ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!