Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ ట్రైన్.. కొత్తగా ఈ రూట్లలో సూపర్ ఫాస్ట్ ట్రైన్స్..
Vande Bharat Express: దేశంలో మొత్తంగా ఇప్పటి వరకు 11 వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు భారత ప్రధాని నరేంద్రమోదీ భోపాల్-న్యూఢిల్లీల మధ్య 11వ వందేభారత్ ట్రైన్ ప్రారంభించారు. సెమీ హైస్పీడ్ రైళ్లను ఇండియా వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీని కలుపుతూ.. వివిధ నగరాల నుంచి నాలుగు రైళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం భోపాల్-ఢిల్లీల మధ్య 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల వ్యవధిలోనే రైలు చేరుకోనుంది.
ఇప్పటి వరకు ప్రారంభం అయిన వందే భారత్ రైళ్లు..
1. ముంబై సెంట్రల్- అహ్మదాబాద్- గాంధీనగర్,
2. ముంబై- సాయినగర్ షిర్డీ,
3. ముంబై-షోలాపూర్,
4. న్యూఢిల్లీ-వారణాసి,
5. న్యూఢిల్లీ-శ్రీ వైష్ణో దేవీ మాత కట్రా,
6. అంబ్ అందౌౌరీ- న్యూ ఢిల్లీ,
7. మైసూరు – పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్
8. నాగ్ పూర్-బిలాస్ పూర్
9. హౌరా-న్యూ జల్పాయ్ గురి
10. సికింద్రాబాద్-విశాఖపట్నం
11. భోపాల్-న్యూ ఢిల్లీ
కొత్తగా ప్రారంభం కాబోయే వందేభారత్ ట్రైన్స్ ఇవే..
చెన్నై-కోయంబత్తూర్ భారత్ ఎక్స్ప్రెస్
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 8, 2023న చెన్నై స్టేషన్ నుంచి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. ఇది 12వ వందేభారత్ ట్రైన్. చెన్నై నుంచి మైసూరుకు ఇప్పటికే ఓ వందే భారత్ ట్రైన్ నడుస్తోంది.
ఢిల్లీ – జైపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్
ఏప్రిల్ 10లోపు ఢిల్లీ-జైపూర్ నగరాల మధ్య వందేభారత్ రైల్ ప్రారంభం అవుతుందని ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో కొత్తగా ఒక వందేభారత్ రైలును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇది రెండో వందేభారత్ రైలు అవుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖల మధ్య ఓ రైలు నడుస్తోంది.
పాట్నా-రాంచీ వందే భారత్ ఎక్స్ప్రెస్
రాంచీ (జార్ఖండ్) నుండి పాట్నా (బీహార్) మార్గంలో 15వ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించే అవకాశం ఉంది. సెమీ-హై స్పీడ్ రైలు ప్రయాణాన్ని 6 గంటల్లో కవర్ చేస్తుంది మరియు ఏప్రిల్ 25న ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Gayatri Gupta: ఇంట్లో 10 కత్తులు దాచుకున్నా.. క్యాస్టింగ్ కౌచ్పై గాయత్రి గుప్తా షాకింగ్ కామెంట్స్!
-
Trump: ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేశాం.. ఫేక్ మీడియా హైలెట్ చేయలేదు.. ట్రంప్ ధ్వజం
-
India Defense New Weapons: రక్షణ వ్యవస్థలోకి భారీగా కొత్త ఆయుధాలు.. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన కీలక మార్పులు ఇవే..!
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
NTRNeel : ఎన్టీఆర్ – నీల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫాన్స్ కు షాక్..
ట్రెండింగ్
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!