Road Accident: బస్సు ట్రక్కు ఢీ.. 10 మంది సాయి భక్తులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: నాసిక్-షిర్డీ హైవేపై బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందగా, 34 మందికి పైగా గాయపడ్డారు. మహారాష్ట్రలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు శుక్రవారం ట్రక్కును ఢీకొట్టింది. పతారే గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Read also: Traffic Jam: టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ టైంవేస్ట్ చేసుకోవద్దన్న సజ్జనార్
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సులో ఉన్న చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 50 మంది ప్రయాణికులు థానే నుంచి బస్సు ఎక్కారు. ఉల్లాస్నగర్ నుంచి సాయి దర్శనానికి బయలుదేరిన 15 బస్సుల్లో ఇదొకటి అని పోలీసులు తెలిపారు. చనిపోయిన 10 మందిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని, గాయపడిన 34 మందిని నాసిక్ జిల్లా ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి, సిన్నార్ ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొ్న్నారు. ప్రయాణిలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు హైవేని క్లియర్ చేశారు. ప్రయాణించేటప్పుడు అప్పమత్తంగా ఉండాలని కోరారు.
Maharashtra | 10 people died and several others injured after a bus carrying Sai Baba devotees collided with a truck near Pathare on Nashik-Shirdi Highway: Nashik Police pic.twitter.com/Xel2Irb0vc
— ANI (@ANI) January 13, 2023
Read also: Dog Attack Child: బాలిక పై వీధి కుక్కుల దాడి.. పరిస్థితి విషమం
బస్సు ప్రమాదంలో మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేసిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
ltr”>Maharashtra CM Eknath Shinde expresses condolences on the loss of lives in a bus accident on Nashik-Shirdi highway, announces ex-gratia of Rs 5 lakhs each to the families of the deceased. The CM has ordered relevant authorities to conduct an investigation into the incident. https://t.co/cJMws5y9b2
— ANI (@ANI) January 13, 2023
Negligence Doctors: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి.. వైద్యపరీక్షలు చేయకుండా ఆపరేషన్
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!