Kamal Haasan: ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు.. తొలి స్పీచ్లో కమల్హాసన్ వార్నింగ్
- తొలి స్పీచ్లో అదరగొట్టిన కమల్ హాసన్
- ఈసీ, కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజం
- ఏ ప్రభుత్వం శాశ్వతం కాదంటూ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరికీ అధికారం శాశ్వతం కాదని.. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం శాశ్వతంగా లేదని మక్కల్ నీది మయ్యం అధినేత, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా తొలిసారి కమల్ హాసన్ రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్.. వస్తున్నాయ్’’ అంటూ తెలుగు భాషతో స్పీచ్ మొదలు పెట్టారు. ఏం మాట్లాడుతున్నానో తెలుగు వారికి అర్థమవుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Bill Gates: నేను చింతిస్తున్నా.. క్షమించండి.. ఎప్స్టీన్ ఫైల్పై బిల్ గేట్స్ పశ్చాత్తాపం
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాను తీవ్రంగా విమర్శించారు. తమిళనాడులో దాదాపు కోటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని.. వారంతా బతికినంత కాలం చనిపోయే ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీహార్ను ఉదాహరణగా చూపిస్తూ ఎన్నికల కమిషన్ జీవిస్తున్నవారిని కూడా చనిపోయినట్లుగా పేర్కొంటుందని గుర్తుచేశారు. ఇదొక కొత్త రకమైన వ్యాధిగా అభివర్ణించారు. ఈ వ్యాధి దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందకూడదన్నారు. ఎన్నికల కమిషన్ అయితే ఈ వ్యాధి వ్యాప్తి చేయడానికి పూనుకుందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ మా ఓటు హక్కును తనిఖీ చేస్తోందని.. స్పెల్లింగ్లు, చిరునామాలు తనిఖీ చేస్తున్నారన్నారు. అక్రమ ఎన్నికల ద్వారా విజయం సాధించాలని చూస్తున్నారని విమర్శించారు. అయినా ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని.. ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!
త్వరలో దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ‘సర్’ నిర్వహించింది. డిసెంబర్లో ముసాయిదా విడుదల చేసినప్పుడు తమిళనాడులో 97 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లుగా ప్రకటించింది. వారంతా చనిపోయారని/ బదిలీ చేయబడ్డారని పేర్కొంది. అనంతరం 1.90 కోట్ల మంది ఓటర్లుగా ఉన్నట్లు తెలిపింది. తుది జాబితా ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ రానుంది.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!