Kamal Haasan: ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు.. తొలి స్పీచ్లో కమల్హాసన్ వార్నింగ్
- తొలి స్పీచ్లో అదరగొట్టిన కమల్ హాసన్
- ఈసీ, కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజం
- ఏ ప్రభుత్వం శాశ్వతం కాదంటూ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరికీ అధికారం శాశ్వతం కాదని.. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం శాశ్వతంగా లేదని మక్కల్ నీది మయ్యం అధినేత, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా తొలిసారి కమల్ హాసన్ రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్.. వస్తున్నాయ్’’ అంటూ తెలుగు భాషతో స్పీచ్ మొదలు పెట్టారు. ఏం మాట్లాడుతున్నానో తెలుగు వారికి అర్థమవుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Bill Gates: నేను చింతిస్తున్నా.. క్షమించండి.. ఎప్స్టీన్ ఫైల్పై బిల్ గేట్స్ పశ్చాత్తాపం
Also Read
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
- Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్మార్టంలో షాకింగ్ విషయాలు
- Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
- Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాను తీవ్రంగా విమర్శించారు. తమిళనాడులో దాదాపు కోటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని.. వారంతా బతికినంత కాలం చనిపోయే ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీహార్ను ఉదాహరణగా చూపిస్తూ ఎన్నికల కమిషన్ జీవిస్తున్నవారిని కూడా చనిపోయినట్లుగా పేర్కొంటుందని గుర్తుచేశారు. ఇదొక కొత్త రకమైన వ్యాధిగా అభివర్ణించారు. ఈ వ్యాధి దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందకూడదన్నారు. ఎన్నికల కమిషన్ అయితే ఈ వ్యాధి వ్యాప్తి చేయడానికి పూనుకుందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ మా ఓటు హక్కును తనిఖీ చేస్తోందని.. స్పెల్లింగ్లు, చిరునామాలు తనిఖీ చేస్తున్నారన్నారు. అక్రమ ఎన్నికల ద్వారా విజయం సాధించాలని చూస్తున్నారని విమర్శించారు. అయినా ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని.. ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!
త్వరలో దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ‘సర్’ నిర్వహించింది. డిసెంబర్లో ముసాయిదా విడుదల చేసినప్పుడు తమిళనాడులో 97 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లుగా ప్రకటించింది. వారంతా చనిపోయారని/ బదిలీ చేయబడ్డారని పేర్కొంది. అనంతరం 1.90 కోట్ల మంది ఓటర్లుగా ఉన్నట్లు తెలిపింది. తుది జాబితా ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ రానుంది.
తాజావార్తలు
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
-
Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
-
Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
-
Luger : ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..! షాక్లో ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!