Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!
- కలకలం సృష్టించిన ఘజియాబాద్ ఆత్మహత్య కేసు
- అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
- పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఘజియాబాద్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఏకంగా 9వ అంతస్తు నుంచి దూకి ఒకేసారి ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. అయితే ముగ్గురు కూడా ‘కొరియన్ లవ్ గేమ్’కు బానిసై ప్రాణాలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ‘అమ్మా.. పాపా.. క్షమించండి.’ అంటూ ఒక సూసైడ్ నోట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గదిలో అనేక రకమైన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చేతన్ కుమార్.. ఫారెక్స్ వ్యాపారవేత్త. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అంతేకాకుండా చేతన్ కుమార్కి చెందిన ఇద్దరు సోదరీమణులు కూడా ఇతనితోనే ఉంటున్నారు. మొత్తం కుటుంబం అంతా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లోని సాహిబాబాద్ ప్రాంతంలోని భారత్ సిటీలో నివాసం ఉంటున్నారు.
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
అయితే కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. దాదాపు చేతన్ కుమార్కు రూ.2 కోట్ల అప్పు ఉంది. దీంతో ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోవడంతో పిల్లల చదువు నిలిచిపోయింది. లాక్డౌన్ దగ్గర నుంచి పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే బందీ అయిపోయారు. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఇంట్లో అంతంత మాత్రంగానే ఉంటున్నారు. కుటుంబ సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఈ క్రమంలో కుమార్తెలు మొబైల్కు బానిసైపోయారు. ‘కొరియన్ లవ్ గేమ్’కు ముగ్ధులైపోయారు. వారి పేర్లు కూడా కొరియన్ పేర్లు పెట్టుకున్నారు అంటే వారు ఎంతగా బానిస అయ్యారో అర్థమవుతోంది. ఈ క్రమంలో 10 రోజుల క్రితం కుమార్తెల మొబైల్స్ను తీసుకుని చేతన్ కుమార్ దాచిపెట్టేశాడు. అంతేకాకుండా ఆ ఫోన్లు అమ్మేసి.. ఆ డబ్బుతో విద్యుత్ బిల్లు రూ.800 చెల్లించాడు. దీంతో కుమార్తెలు మానసికంగా కుంగిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురై కొరియన్ లవ్ గేమ్ ఆడలేకపోతున్నామని మనో చింతకు లోనయ్యారు. ఇంతలోనే కోపంతో ఉన్న తండ్రి పెళ్లిళ్లు చేస్తానని బెదిరించాడు. అయితే తాము భారతీయులం చేసుకోమని.. కొరియన్లనే చేసుకుంటామని తెగేసి చెప్పారు. ఈ ప్రతిపాదన కూడా వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది.
మొత్తానికి ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిషిక (16), ప్రాచి (14), పాఖి(12) తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తమ బాధనంతా డైరీలో వెళ్లగక్కారు. ‘‘క్షమించండి నాన్న.. నిజంగా క్షమించండి.’’ అంటూ ఒక సూసైడ్ నోట్ను రాసి తెల్లవారుజామున 2:15 నిమిషాలకు ముగ్గురు కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని 9వ అంతస్థులోని బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. కిందనున్న స్థానికులు గమనించి వెంటనే అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.
డీజీపీ..
ఆన్లైన్ వ్యసనం యువ మనసులపై తీవ్ర ప్రభావం చూపించిందని ఉత్తరప్రదేశ్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రాజీవ్ కృష్ణ వెల్లడించారు. ఆన్లైన్ వ్యసనానికి బానిసలైన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిరంతరం మొబైల్స్తోనే గడిపినట్లుగా తేలిందన్నారు. బాలికలకు సరైన విద్య లేదని… ఈ క్రమంలోనే మొబైల్కు బానిసలైనట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?