Mukesh Ambani Family Security: ముకేష్ అంబానీ ఫ్యామిలీ సెక్యూరిటీ కొనసాగింపుకు సుప్రీంకోర్టు ఓకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani Family Security Case: పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఫ్యామిలీకి సెక్యూరిటీ కొనసాగింపుకు కేంద్రానికి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. శుక్రవారం ఈ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గతంలో త్రిపుర హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ముకేష్ అంబానీ ఫ్యామిలీకి భద్రత కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంబానీ కుటుంబ భద్రతకు సంబంధించి దాఖలైన కేసును కొట్టివేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై గతంలో త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. శుక్రవారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ట మురారి, హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం కేంద్రప్రభుత్వానికి భద్రత కొనసాగించవచ్చని ఆదేశాలు ఇచ్చింది.
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
గతంలో ముకేష్ అంబానీ సెక్యూరిటీపై త్రిపుర హైకోర్టులో పిల్ దాఖలు అయింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును గత నెల చివర్లో సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్రం తరుపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. త్రిపురలో పిటిషన్ దాఖలు చేసిన బికాష్ సాహా అనే వ్యక్తికి ముకేష్ అంబానీ సెక్యూరిటీకి ఎలాంటి సంబంధం లేదని వాదించారు. గతంలో త్రిపుర హైకోర్ట్ ఈ విషయంపై మే 31, జూన్ 21న మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ముకేష్ అంబానీ, అతని భార్య, పిల్లలకు ఎలాంటి ప్రమాదం ఉంది అనే విషయంపై కేంద్ర హోంశాఖ వద్ద ఉన్న పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ముకేష్ అంబానీ కుటుంబ భద్రతపై క్లారిటీ ఇస్తూ తీర్పు చెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను, సుప్రీంకోర్టు కేసును రద్దు చేసింది.
భారతదేశంలో, ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతకు కేంద్ర భారీ భద్రతను కల్పిస్తోంది. అంబానీకి జెడ్+ సెక్యూరిటీని ఉంది. అతని భార్య నీతా అంబానీకి వై + సెక్యూరిటీ ఉంది. జెడ్ + సెక్యూరిటీని భారతదేశంలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి కల్పిస్తారు. దీని కింద మొత్తం 50-55 సీఆర్పీఎస్ సాయుధ కమాండోలు 24 గంటల పాటూ కాపలాగా ఉంటారు.
తాజావార్తలు
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!