Sanjay Singh: లలిత్ మోదీ ఎక్కడున్నాడో సుస్మితా సేన్కు తెలిసింది.. నరేంద్ర మోదీకి మాత్రం ఇంకా తెలియలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Singh allegations on modi government: ఇటీవల లలిత్ మోదీ-సుస్మితా సేన్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. మాల్డీవుల్లో లలిత్ మోదీ, సుస్మితాసేన్ డేటింగ్ చేసినట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. మాల్దీవుల అనంతరం లండన్లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నట్లు లలిత్ మోదీ స్వయంగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఆప్ నేత సంజయ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐపీఎల్లో అవకతవకలతో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీని ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం పట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. అయితే లలిత్ మోదీని మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కనుక్కుందంటూ సెటైర్లు వేశారు.
Read Also: Govt Jobs: శుభవార్త.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
ఆప్ మంత్రి మనీస్ సిసోడియాపై మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ విచారణకు కసరత్తులు జరుగుతున్న నేపథ్యంలో సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశం విడిచి పారిపోయిన వ్యక్తులను పట్టుకోవడం ప్రధాని మోదీకి చేతకాదని సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రభుత్వ చిత్తశుద్ధిని, నిజాయతీని చూసి మోదీ సర్కారు భయపడుతోందని విమర్శలు చేశారు. తప్పుడు ఆరోపణలతో ఆప్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇలాగే అరెస్ట్ చేశారని, ఇప్పుడు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను టార్గెట్ చేశారని సంజయ్ సింగ్ మండిపడ్డారు. లలిత్ మోదీతో సుస్మితా సేన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని.. కానీ మోదీ ప్రభుత్వం ఆయన్ను ఎందుకు పట్టుకోలేకపోయిందని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!