Monsoon Update: గుడ్న్యూస్.. మరో రెండు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్న రుతుపవనాలు
- మరో రెండు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్న రుతుపవనాలు
- హర్యానా..పంజాబ్.. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు వాతావరణ శాఖ శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon Update: ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారత రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే రుతుపవనాలు వ్యాపించని రాష్ట్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. పంజాబ్, హర్యానాకు రుతుపవనాలు ఎప్పుడు వస్తాయో ప్రకటించింది. మండే వేడిని ఎదుర్కొన్న తర్వాత, రుతుపవనాలు ఢిల్లీకి కూడా వచ్చాయి, అయితే పంజాబ్, హర్యానా ప్రజలు ఇంకా రుతుపవనాల కోసం ఎదురు చూస్తున్నారు. వాతావరణ శాఖ ప్రకారం, రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో పంజాబ్, హర్యానాతో సహా దేశం మొత్తాన్ని కవర్ చేస్తాయి. ఆ తర్వాత యూపీ-బీహార్ తరహాలో ఈ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయి.
Read Also: Collapse: ఢిల్లీ తర్వాత గుజరాత్ లో భారీ ప్రమాదం.. కూలిన రాజ్కోట్ ఎయిర్ పోర్టు టెర్మినల్
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
హిమాచల్ ప్రదేశ్లో ఆరెంజ్ అలర్ట్
హిమాచల్ ప్రదేశ్లోని 12 జిల్లాల్లో ఏడింటిలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. చంబా, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని వివిధ చోట్ల భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు గురువారం హిమాచల్ ప్రదేశ్లోని అనేక ప్రాంతాలకు చేరుకున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, ఇప్పటివరకు సిమ్లాలో 84 మిల్లీమీటర్ల వర్షపాతం, సబర్బన్ ప్రాంతం జుబ్బర్హట్టిలో 136 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోహర్లో 42 మిమీ, మషోబ్రాలో 39.5 మిమీ, స్లోపర్లో 34.6 మిమీ, కుఫ్రి, షిలారులో 24.2 మిమీ, సరహన్, బర్తిన్లలో 22 మిమీ, ఘగాస్లో 18.8 మిమీ, కర్సోగ్లో 18.2 మిమీ వర్షపాతం నమోదైంది.
Read Also: Pawan Kalyan: జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..
ఉత్తరాఖండ్లో వ్యాపించిన రుతుపవనాలు
ఢిల్లీ-ఎన్సీఆర్ తర్వాత ఉత్తరాఖండ్లో కూడా రుతుపవనాలు వ్యాపించాయి. రుతుపవనాల రాకతో సామాన్యులు పర్వతాల్లో ప్రయాణించకుండా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఐఎండీ ప్రకారం, రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఉత్తరాఖండ్లోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు పర్వత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఢిల్లీకి రుతుపవనాల రూపంలో విపత్తు
రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ వాసులకు రుతుపవనాల తొలి వర్షం విపత్తుగా మారింది. నిజానికి, మొదటి వర్షం సమయంలో ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం, శుక్రవారం ఉదయం 8:30 గంటల ముందు 24 గంటల్లో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది జూన్లో సగటు వర్షపాతం 74.1 మిమీ కంటే మూడు రెట్లు ఎక్కువ. 1936 తర్వాత 88 ఏళ్లలో ఈ నెలలో ఇదే అత్యధిక వర్షపాతం. ఈ రోజు ఉదయం కూడా ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది.
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?