Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
- షకీబ్ అల్ హసన్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
- ఇంటికి నిప్పంటించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakib Al Hasan House Attacked: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడి, ఇంటికి నిప్పంటించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన షకీబ్ అల్ హసన్ ఢిల్లీలో మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరైన కొన్ని గంటల తర్వాత చోటుచేసుకుంది. దక్షిణాసియా విదేశీ ప్రతినిధుల క్లబ్ (Foreign Correspondents’ Club of South Asia) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈ మీడియా సమావేశం జరిగింది. ఇందులో షేక్ హసీనా ప్రసంగించగా, షకీబ్ అల్ హసన్ కూడా హాజరయ్యారు.
ఇంటిపై రాళ్లతో దాడి.. నిప్పంటించే ప్రయత్నం
ది డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు మగురా సదర్ పోలీస్ స్టేషన్ అధికారి Md Abdullah Al Mamun తెలిపారు. కొంతమంది దుండగులు షకీబ్ అల్ హసన్ ఇంటిపై ఇటుకలు విసిరారని, కిటికీలను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటికి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరనే విషయం వెంటనే తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం షకీబ్ ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు.
Also Read
ఘటనపై అవామీ లీగ్ స్పందన
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అవామీ లీగ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. షకీబ్ అల్ హసన్ ఇంటిపై దాడి యత్నాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. షేక్ హసీనా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్కు షకీబ్ హాజరైన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం రాజకీయంగా ఆందోళన కలిగించే అంశమని అవామీ లీగ్ పేర్కొంది. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని, ఈ ఘటన కూడా అందులో భాగమేనని పార్టీ ఆరోపించింది.
2024 నుంచి బంగ్లాదేశ్కు దూరంగా షకీబ్
2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నుంచి షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్కు దూరంగా ఉంటున్నారు. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. రాజకీయ అశాంతి సమయంలో జరిగిన ఓ హత్య కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లో మొత్తం 147 మందితో పాటు షకీబ్ పేరు కూడా ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే, చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొనేందుకు తాను బంగ్లాదేశ్కు తిరిగి రావాలని కోరుకుంటున్నానని, అయితే తన వ్యక్తిగత భద్రతపై హామీ కావాలని షకీబ్ గతంలో పేర్కొన్నారు.
అంతర్జాతీయ క్రికెట్కు ఇంకా అధికారికంగా వీడ్కోలు చెప్పలేదు
షకీబ్ అల్ హసన్ 2024 చివరి నుంచి బంగ్లాదేశ్ తరఫున క్రికెట్ ఆడలేదు. అయినప్పటికీ ఆయన అంతర్జాతీయ క్రికెట్కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. అన్ని ఫార్మాట్లలో పూర్తిస్థాయి సిరీస్ ఆడిన తర్వాతే క్రికెట్కు వీడ్కోలు చెప్పాలని షకీబ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, 2024 ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో మగురా-1 నియోజకవర్గం నుంచి అవామీ లీగ్ అభ్యర్థిగా షకీబ్ అల్ హసన్ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయనపై ఉన్న కేసులు, భద్రతా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్కు ఆయన తిరిగి రావడం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!