Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- వెస్టిండీస్పై రెండో టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం.
- రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసిన పాకిస్థాన్.
- WTC 2025-27 పాయింట్ల పట్టికలో 9వ స్థానం నుంచి 8వ స్థానానికి చేరిన పాక్....
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak vs WI: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27లో పాకిస్థాన్ జట్టు కీలక విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో రెండో మ్యాచ్ను 8 వికెట్ల తేడాతో గెలిచింది పాకిస్థాన్. దీనితో పాక్ WTC పాయింట్ల పట్టికలో ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తొలి టెస్టులో ఓటమి పాలైన తర్వాత పట్టికలో చివరి స్థానానికి చేరుకున్న పాకిస్థాన్, ఈ విజయంతో తిరిగి 8వ స్థానానికి చేరుకుంది.
రెండో టెస్టు విజయంతో పాకిస్థాన్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్ల్లో రెండు విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేయడంతో.. దీంతో ఆ జట్టు పాయింట్ల శాతం (PCT) 22.22కి చేరుకుంది. తొలి టెస్టు తర్వాత కేవలం ఒకే విజయంతో పట్టికలో అట్టడుగున ఉన్న పాకిస్థాన్కు ఈ విజయం కాస్త ఊరటనిచ్చింది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో 8 మ్యాచ్ల్లో 7 విజయాలు, ఒకే ఓటమితో ఆ జట్టు 87.50 PCT ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 75.00 PCTతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ 72.22 PCTతో మూడో స్థానంలో ఉన్నాయి. ఆపై బంగ్లాదేశ్ నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రాతో 58.33 PCT సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఇక శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ ఇప్పటివరకు తొమ్మిది టెస్టుల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములు, ఒక డ్రాతో 48.15 PCTతో భారత జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా శ్రీలంక (41.67 PCT), ఇంగ్లండ్ (24.36 PCT) వరుసగా ఆరో, ఏడో స్థానాల్లో ఉన్నాయి.

ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ అద్భుత విజయం సాదిందించింది. ఈ విజయంతో విదేశీ గడ్డపై వరుసగా 8 టెస్టుల్లో ఎదురైన ఓటముల పరంపరకు స్వస్తి పలికింది. అంతేకాకుండా వెస్టిండీస్పై 2000 సంవత్సరం తర్వాత ఒక్క టెస్ట్ సిరీస్ కూడా కోల్పోని రికార్డును కొనసాగించింది.
ఈ మ్యాచ్ లో 77 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో మెరిసిన అబ్దుల్లా షఫీక్ అజేయంగా 24 పరుగులు చేయగా, కెప్టెన్గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి సిరీస్ ఆడుతున్న బాబర్ అజామ్ కూడా 24 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మ్యాచ్ను ముగించే క్రమంలో బాబర్, వెస్టిండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు. దీనితో సిరీస్ 1-1తో సమం అయ్యింది.
తాజావార్తలు
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!