Tamil Nadu: గవర్నర్ వర్సెస్ సీఎం స్టాలిన్.. కేంద్రాన్ని ప్రభుత్వం ఏం కోరిందంటే..!
- తమిళనాడు గవర్నర్ వర్సెస్ సీఎం స్టాలిన్
- గవర్నర్ను రీకాల్ చేయాలని కేంద్రాన్ని కోరిన ప్రభుత్వం
తమిళనాడులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య అగ్ని రాజుకుంది. గవర్నర్ ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే ద్రవిడ అనే పదం పలకకుండా దాటవేశారని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. జాతి ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. చెన్నైలోని దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం జరిగింది. ఇదే ఈవెంట్లో హిందీ మాసోత్సవం కూడా నిర్వహించారు. హిందీని, హిందీ భాషేతర రాష్ట్రాల ఈవెంట్ను కలిపి నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ తొలుత తప్పుబట్టారు. ఈవెంట్ సందర్భంగా రాష్ట్ర గేయాన్ని ఆలపిస్తూ.. ద్రవిడ అనే పదాన్ని గాయకులు దాటవేయడంపై వివాదం నెలకొంది. దీనిపై దూరదర్శన్ తమిళ్ క్షమాపణ కూడా చెప్పింది. గాయకుల పొరపాటుగా పేర్కొంది.
ఇది కూడా చదవండి: Delhi: తీహార్ జైలు దగ్గర సీఎం అతిషి హడావుడి.. సత్యేందర్ జైన్కు స్వాగతం
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
- IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ కూడా ‘ద్రవిడ’ అనే పదాన్ని ఉచ్చరించకపోవడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు. దేశ ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆయన.. గవర్నర్ పదవికి ఏ మాత్రం అర్హులు కాదంటూ ఆరోపించారు. రాష్ట్ర గేయంలో ఆ పదాన్ని ఉచ్చరించకపోవడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఒకవేళ జాతీయ గీతంలో ద్రవిడ అనే పదం వస్తే ఇలానే వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా తమిళనాడును, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న గవర్నర్ను తక్షణమే రీకాల్ చేయాలని కేంద్రాన్ని స్టాలిన్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అభ్యంతరాలపై గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఈ వ్యవహారంలో గవర్నర్ ఆర్ఎన్ రవి తప్పేమీ లేదని పేర్కొంది. ఆయన హాజరైన కార్యక్రమంలో గేయాన్ని ఆలపించిన బృందం పొరపాటుగా పేర్కొంది. ఈ విషయం వెంటనే నిర్వాహకుల దృష్టికి తేవడంతో పాటు, సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు గవర్నర్ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు.
తమిళ సంస్కృతి, వారసత్వాన్ని పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అలాగే తాను కూడా అలాగే పని చేస్తానని గవర్నర్ రవి పేర్కొన్నారు. గవర్నర్పై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం సరికాదని.. తప్పుడు ఆరోపణలు చేయడం చౌకబారు వ్యవహారం అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలోకి “కిమ్” ఆర్మీని దింపిన పుతిన్..
తాజావార్తలు
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!