తమిళనాడులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య అగ్ని రాజుకుంది. గవర్నర్ ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే ద్రవిడ అనే పదం పలకకుండా దాటవేశారని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. జాతి ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.