India At UN: కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్..
- మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్..
- ధీటుగా బదులిచ్చిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India At UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ‘‘కాశ్మీర్’’ అంశాన్ని లేవనెత్తింది. దీనిపై భారత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు, శాంతిభద్రతలపై భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని ‘‘రెచ్చగొట్టేవి’’, ‘‘రాజకీయ ప్రచారం’’ అని భారత్ తప్పుపట్టింది. పాకిస్తాన్లోని హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పింది.
Read Also: Diwali 2024: దీపావళి నాడు వాయు కాలుష్యంపై ఎలాంటి జాగ్రత్తలు వహించాలి..?
Also Read
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
‘‘తప్పుడు సమాచారం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ఒక వ్యూహం ఆధారంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం జుగుప్సాకరమైనవి అయినప్పటికీ, పూర్తిగా వీటిని ఊహించవే’’ అని పాక్ వ్యాక్యలపై యూఎన్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ శుక్రవారం యూఎన్ఎస్సీలో అన్నారు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పడమే అనే అంశంపై యూఎస్ఎస్సీ డిబేట్ సందర్భంగా భారత్ ఈ ప్రకటన చేసింది.
చర్చల్లో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ముఖ్యమైన వార్షిక చర్యలో ఇలాంటి రాజకీయ ప్రచారం చేయడం పూర్తిగా తప్పని చెప్పింది. పాకిస్తాన్లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి, ముఖ్యంగా హిందువులు, సిక్కులు, క్రైస్తవుల పరిస్థిత దయనీయంగా ఉందని మాకు బాగా తెలుసని భారత్ రిప్లై ఇచ్చింది. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ డేటా ప్రకారం ఈ మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వెయ్యి మంది మహిళలు ప్రతి సంవత్సరం అపహరణకు, బలవంతపు మత మార్పిడులకు మరియు బలవంతపు వివాహాలకు గురవుతున్నారని హరీష్ తెలిపారు.
తాజావార్తలు
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి