Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీ పొడగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరో 7 రోజులు సిసోడియాను విచారించేందుకు సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టును కోరింది. అయితే కోర్టు మరో 5 రోజుల కస్టడీకి అప్పగించింది. మార్చి 20తో సిసోడియా కస్టడీ ముగుస్తుండటంతో విచారణకు మరింత సమయం కావాలని ఈడీ కోరిన నేపథ్యంలో కస్టడీని పొడగించింది. ఈడీ తనను ప్రతీ రోజు 30 నిమిషాల నుంచి గంట వరకు విచారించిందని, ఇకపై తనను జైలులో ఉంచాల్సిన అవసరం లేదని మనీష్ సిసోడియా కోర్టులో వాదించారు. రోజూ ఈడీ తనను అవే ప్రశ్నలు అడుగుతున్నారని కోర్టుకు సిసోడియా వెల్లడించారు.
ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగంపై ఇటీవల సీబీఐ మనీస్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఆ తరువాత ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. గత నెల ఫిబ్రవరి 26 నుంచి సిసోడియా జైలులో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఏడు నెలల పాలు కేసును విచారించిన తర్వాత, కస్టడీకి కోరారని, దర్యాప్తు సంస్థలు దీని వల్ల ఏం సంపాదించిందో చూపించాలని సిసోడియా తరుపున న్యాయవాది కోరారు.
Also Read
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Read Also: Labourer Wins Lottery: రూ.75 లక్షలు గెలుచుకున్న కూలీ.. నేరుగా పోలీస్ స్టేషన్కు పరుగు
తనకు కస్టడీని పొడగించడాన్ని సిసోడియా వ్యతిరేకించారు. ఈడీ, సీబీఐ పని చేస్తోందని ఆరోపించారు. ఈడీ కేవలం నేరం ద్వారా వచ్చిన ఆదాయాలపై మాత్రమే దర్యాప్తు చేయగలదని, నేరంపై కాదని సిసోడియా కోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో సిసోడియా ఆయన సెల్ ఫోన్ ను పలుమార్లు మార్చాడని ఈడీ ఆరోపించింది. ఈడీ ఎప్పుడూ మొబైల్ ఫోన్ల ధ్వంసం చేశారనే అంశాన్ని లేవనెత్తుతోందని, సీబీఐ, ఈడీలు దీన్ని రిమాండ్ రిపోర్టులోనే ప్రస్తావించారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు ఏంచేస్తున్నాయంటూ సిసోడియా లాయర్ కోర్టులో ప్రశ్నించారు. సిసోడియాను ఎట్టి పరిస్థితుల్లో జైలులోనే ఉంచాలని వారు కోరకుంటున్నారని ఆప్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీ కావాలనే ఆప్ పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిన సిసోడియాను కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ విమర్శిస్తున్నారు. ఢిల్లి లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్ తో సిసోడియా అక్రమాలకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
తాజావార్తలు
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!