Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీ పొడగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరో 7 రోజులు సిసోడియాను విచారించేందుకు సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టును కోరింది. అయితే కోర్టు మరో 5 రోజుల కస్టడీకి అప్పగించింది. మార్చి 20తో సిసోడియా కస్టడీ ముగుస్తుండటంతో విచారణకు మరింత సమయం కావాలని ఈడీ కోరిన నేపథ్యంలో కస్టడీని పొడగించింది. ఈడీ తనను ప్రతీ రోజు 30 నిమిషాల నుంచి గంట వరకు విచారించిందని, ఇకపై తనను జైలులో ఉంచాల్సిన అవసరం లేదని మనీష్ సిసోడియా కోర్టులో వాదించారు. రోజూ ఈడీ తనను అవే ప్రశ్నలు అడుగుతున్నారని కోర్టుకు సిసోడియా వెల్లడించారు.
ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగంపై ఇటీవల సీబీఐ మనీస్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఆ తరువాత ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. గత నెల ఫిబ్రవరి 26 నుంచి సిసోడియా జైలులో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఏడు నెలల పాలు కేసును విచారించిన తర్వాత, కస్టడీకి కోరారని, దర్యాప్తు సంస్థలు దీని వల్ల ఏం సంపాదించిందో చూపించాలని సిసోడియా తరుపున న్యాయవాది కోరారు.
Also Read
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
Read Also: Labourer Wins Lottery: రూ.75 లక్షలు గెలుచుకున్న కూలీ.. నేరుగా పోలీస్ స్టేషన్కు పరుగు
తనకు కస్టడీని పొడగించడాన్ని సిసోడియా వ్యతిరేకించారు. ఈడీ, సీబీఐ పని చేస్తోందని ఆరోపించారు. ఈడీ కేవలం నేరం ద్వారా వచ్చిన ఆదాయాలపై మాత్రమే దర్యాప్తు చేయగలదని, నేరంపై కాదని సిసోడియా కోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో సిసోడియా ఆయన సెల్ ఫోన్ ను పలుమార్లు మార్చాడని ఈడీ ఆరోపించింది. ఈడీ ఎప్పుడూ మొబైల్ ఫోన్ల ధ్వంసం చేశారనే అంశాన్ని లేవనెత్తుతోందని, సీబీఐ, ఈడీలు దీన్ని రిమాండ్ రిపోర్టులోనే ప్రస్తావించారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు ఏంచేస్తున్నాయంటూ సిసోడియా లాయర్ కోర్టులో ప్రశ్నించారు. సిసోడియాను ఎట్టి పరిస్థితుల్లో జైలులోనే ఉంచాలని వారు కోరకుంటున్నారని ఆప్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీ కావాలనే ఆప్ పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిన సిసోడియాను కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ విమర్శిస్తున్నారు. ఢిల్లి లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్ తో సిసోడియా అక్రమాలకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
తాజావార్తలు
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?