Manipur Violence: మైయిటీ విద్యార్థుల హత్యలో కీలక సూత్రధారిని అరెస్ట్ చేసిన సీబీఐ..
Manipur Violence: మణిపూర్ రాష్ట్రం గత నాలుగు నెలలుగా అల్లకల్లోలంగా ఉంది. మైయిటీ, కుకీ తెగల మధ్య వివాదం కారణంగా ఆ రాష్ట్రంలో 175 మంది పైగా మరణించారు. వేల సంఖ్యలో సొంత గ్రామాలను వదిలి వలసపోయారు. అయితే ఈ అల్లర్లలో కుట్ర దాగి ఉందని తెలుస్తోంది. బంగ్లాదేశ్, మయన్మార్ లోని కొన్ని ఉగ్రసంస్థలతో సంబంధం పెట్టుకున్న కొందరు మణిపూర్ వాసులు అల్లర్లు మరింత పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఇద్దరు మైయిటీ విద్యార్థుల హత్య ఆ రాష్ట్రం మరోసారి అగ్నిగుండంగా మారేందుకు కారణమైంది. ఈ హత్యలో ప్రధాన సూత్రధారిగా ఉన్న 22 యువకుడిని సీబీఐ పూణేలో అరెస్ట్ చేసినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం బుధవారం పూణే నుండి పౌలున్మాంగ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు గౌహతికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.
ప్రత్యేక కోర్టు అతన్ని అక్టోబర్ 16 వరకు సీబీఐ కస్టడీకి పంపింది. ఈ కేసులో పావోలున్మాంగ్ ప్రధాన సూత్రధారి అని సీబీఐ అనుమానిస్తోంది.
Also Read
Read Also: Putin: గాజాపై ఇజ్రాయిల్ గ్రౌండ్ ఆపరేషన్స్ భారీ పౌర నష్టాన్ని తెస్తుంది..
అంతకుముందు ఈ హత్యతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల్ని అక్టోబర్ 1న చూరచంద్ పూర్ ప్రాంతంలో సైన్యం, మణిపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. పట్లుబడిన వారిలో ఇద్దరు పురుషులు పావోయిన్లున్ హీకిప్, స్మాల్సామ్ హకిప్లతో పాటు ఇద్దరు మహిళలు లింగ్నీ చాంగ్ బైటెకుకి, టిన్నెల్ హింగ్ హెన్తాంగ్ ఉన్నారు.
ఫిజామ్ హేమంజిత్(20) ఏళ్ల యువకుడిని, 17 ఏళ్ల హిజామ్ లింతోంగంబి అనే అమ్మాయి హత్యకు గురయ్యారు. జూలైలో తప్పిపోయిన వీరిని చంపిన ఫోటోలు సెప్టెంబర్ 26న సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కేసులో వీరిద్దరి మృతదేహాలు లభ్యం కాలేదు. హత్యకు ముందు మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో