Manipur Violence: మణిపూర్ హింసలో 54 మంది మృతి..
Manipur Violence: గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకోవడంతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. స్కూళ్లు, వాహనాలు, చర్చిలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. సైన్యం, పారామిలిటీ బలగాలను రాష్ట్రంలో మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సైన్యం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. సైన్యం, అస్సాం రైఫిల్స్ నుంచి 10,000 మంది సైనికులు మోహరించారు.
ఇదిలా ఉంటే ఈ మారణహోమంలో ఇప్పటి వరకు 54 మంది మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. చనిపోయిన 54 మందిలో 16 మృతదేహాలను చురచంద్పూర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచగా, 15 మృతదేహాలు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. అనధికారికంగా మరణాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దుకాణాలు, మార్కెట్లు తిరిగి తెరవడం, వాహనాలు రోడ్లపైకి రావడంతో శనివారం ఇంఫాల్ లోయలో జనజీవనం జాగ్రత్తగా సాధారణ స్థితికి చేరుకుంది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Air India: ప్రయాణికురాలికి తేలు కాటు.. ఎయిరిండియా ఫ్లైట్లో ఘటన
చురచంద్పూర్, మోరె, కక్చింగ్, కాంగ్పోక్పి జిల్లాలను సైన్యం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. 13,000 మందిని రక్షించి సురక్షిత ఆశ్రయాలకు తరలించామని, కొంతమంది ఆర్మీ క్యాంపుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. మణిపూర్ లోని మెజారిటీ కమ్యూనిటీ అయిన మైతైకి గిరిజన హోదా కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న తరుణంలో ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి. మైతై కమ్యూనిటీకి, కొండ ప్రాంతాల్లో నివసించే నాగా, కుకీలకు మధ్య ఘర్షణ తలెత్తింది. దీన్ని నిరసిస్తూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) బుధవారం నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’ సందర్భంగా చురాచంద్పూర్ జిల్లాలోని టోర్బంగ్ ప్రాంతంలో మొదట హింస చెలరేగింది. ఇది నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది.
మైతై కమ్యూనిటీ ఎస్టీ హోదా డిమాండ్ పై నాలుగు వారాల్లోగా కేంద్రానికి సిఫారసు పంపాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో నాగాలు మరియు కుకీలతో సహా గిరిజనులు మార్చ్ నిర్వహించారు. ఇది ఉద్రిక్తతలకు దారి తీసింది. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మైతై వర్గానికి చెందిన వారు. వీరంతా ఇంఫాల్ లోయ ప్రాంతాల్లో నివసిస్తారు. 40 శాతం ఉన్న కుకీలు, నాగాలు, ఇతర గిరిజనులు కొండ ప్రాంతాల్లో నివసిస్తుంటారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!